దళితులపై దాడుల్లో వైకాపాదే రికార్డు
దళితులపై దాడులు చేయడంలో ఎన్నడూ లేని రికార్డును వైకాపా ప్రభుత్వం సొంతం చేసుకుందని రాష్ట్ర తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
చించినాడలో పర్యటించిన తెదేపా నిజ నిర్ధారణ కమిటీ
పెరుగులంక భూముల్లోకి ర్యాలీగా వెళ్తున్న తెదేపా నేతలు
పాలకొల్లు, న్యూస్టుడే: దళితులపై దాడులు చేయడంలో ఎన్నడూ లేని రికార్డును వైకాపా ప్రభుత్వం సొంతం చేసుకుందని రాష్ట్ర తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. చించినాడ పెరుగులంక భూముల్లో తవ్వకాలపై జరుగుతున్న నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించడానికి నిజనిర్ధారణ కమిటీతో వచ్చిన ఆమె మాట్లాడుతూ దళిత పేరుచెప్పి హోంమంత్రి పదవి పొందిన తానేటి వనిత రాష్ట్రంలో దళితులపై వేలాది దాడులు జరుగుతుంటే పెదవి కదపడం లేదన్నారు. చొక్కాలు విప్పి రోడ్డుపై చిందులేసిన మంత్రి సురేష్ దళితులకు అన్యాయం జరుగుతుంటే అటువైపే చూడరన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ సీఎం జగన్ దళితులను ఉక్కు సంకెళ్లతో అణచివేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలు, పేదలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు పెత్తందారులకే పట్టం కడుతున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మట్టి దొంగలకు పోలీసులు కాపలా కాస్తున్నారని వైఎస్ హయాంలో తప్పులుచేసి జైలుపాలైన అధికారుల మాదిరిగానే నేడు తప్పులు చేస్తున్న అధికారులంతా భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగక తప్పదని హెచ్చరించారు. లారీ మట్టి రూ.10 వేలకు వైకాపా నేతలు అమ్ముకుంటున్నారని ప్రభుత్వ పనులకు రెండు లారీలు పనిచేస్తుంటే అక్రమ అమ్మకాలకు 8 లారీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మాట్లాడుతూ ఎన్ని అరాచకాలు చేసినా ఎవరూ ఏం చేయలేరనే భావనతో సీఎం ఉన్నారన్నారు. కమిటీ సభ్యుడు పిల్లి మాణిక్యాలరావు, సీపీఎం నాయకులు, నియోజకవర్గంలోని తెదేపా నాయకులు పాల్గొన్నారు.
స్వల్పఉద్రిక్తత.. పెరుగులంక భూముల పరిశీలనకు వచ్చిన తెదేపా కమిటీని పోలీసులు అడ్డుకోవడంతో చించినాడలో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రామానాయుడు, పార్టీనేత అనిత తదితరులు పోలీసులతో చర్చిస్తున్నపుడు తెదేపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపైనా విమర్శలకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
డీఎస్పీ నేతృత్వంలో మోహరించిన పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.