logo

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

ఉండి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) పేర్కొన్నారు.

Updated : 17 Mar 2024 06:49 IST

మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వెల్లడి

 

కాళ్ల, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) పేర్కొన్నారు. భీమవరంలోని శివ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు తెదేపా అధిష్ఠానం ఒక్క మాట కూడా చెప్పకుండా మరొకరికి సీటు కేటాయించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. పార్టీలు, రంగులు మార్చే అకాశవాద రాజకీయాలు తనకు తెలియదని.. జరిగిన అన్యాయంపై నియోజకవర్గ ప్రజల నుంచి మద్దతు వస్తుండటంతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో అందరి మద్దతు తనకు ఉందన్నారు. ప్రజల సహకారంతో గెలిచి నిరంతరం వారికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తెదేపాకు రాజీనామా చేస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా పార్టీలో తనకు ఎలాంటి పదవులులేవని.. అలాంటప్పుడు రాజీనామా ఎందుకంటూ మాట దాటవేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని