కుక్కునూరు డివిజన్కు మంగళం
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖ
ముగిసిన ఏడేళ్ల ప్రస్థానం
కుక్కునూరు, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని విభజనలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. పోలవరం ముంపు ప్రాంతంగా ఉన్న ఈ డివిజన్, ప్రాజెక్టు నిర్మాణంలో కీలకం కావటంతో ఈ ప్రాంతాన్ని ఏపీకి కేటాయిస్తూ 2014లో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసింది. తొలుత జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ కాగా, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం ఏలూరుకు, డివిజన్ కేంద్రం జంగారెడ్డిగూడేనికి సమీపంలో లేకపోవటంతో ఇక్కడ ప్రజానీకం అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డివిజన్గా రాజపత్రం జారీ అయింది. కుక్కునూరు, వేలేరుపాడు పూర్వపు మండలాలతో పాటు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలతో ఈ డివిజన్ రూపాంతరం చెందింది. దాదాపు 300 చ.కి.మీ. వైశాల్యంతో, 47 రెవెన్యూ గ్రామాలతో కొనసాగుతున్న ఈ డివిజన్ ఈ ఉగాది నాటికి జంగారెడ్డిగూడెం డివిజన్లో విలీనం కానుంది.
సదుపాయాలు లేక..
రెవెన్యూ డివిజన్ అన్న పేరే తప్ప, ఎప్పుడూ ఆ స్థాయిలో ఈ కేంద్రం కొనసాగిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉపకలెక్టర్లుగా ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించటం, వారు నివాసం ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవటంతో వారు డివిజన్ ప్రధాన కేంద్రాన్నే మార్చేశారు. ఐటీడీఏ ఉన్న కె.ఆర్.పురాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసుకుని పాలన జరిపారు. తొలుత సాగిలి షన్మోహన్ ఉపకలెక్టర్గా వచ్చారు. కొద్ది నెలలు ఆయన ఇక్కడ నుంచే డివిజన్ కార్యకలాపాలు కొనసాగించారు. ఆయనకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కూడా అదనపు బాధ్యతలు ఉండటం, అక్కడ అధికార నివాసం, ఇతరత్రా సౌకర్యాలు ఉండటంతో ఈ కార్యాలయ పాలనను అక్కడ నుంచే కొనసాగించటం ఆరంభించారు. కొద్దిరోజులు తర్వాత కార్యాలయం పూర్తిగా ఐటీడీఏ కు మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అధికారులు కూడా ఇదే తరహాలో డివిజన్ కార్యకలాపాలు కొనసాగించారు. ఇక్కడ కార్యాలయం ఉన్నా అందులో ఒక ఉద్యోగి మాత్రమే ఉండేవారు. రాజకీయ పార్టీలు సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సమయంలో వినతి పత్రం సీ్వీకరించేందుకు ఆ అధికారి ఉపయోగపడేవారు. డివిజన్ అన్న సంతోషం కొన్ని నెలలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవించలేకపోయారు.
ముంపు పేరిట..
రెవెన్యూ డివిజన్ అయిన తొలి రోజుల్లో ఈ ప్రాంతం రూపురేఖలు మార్చేస్తామని నాయకులు ప్రకటించారు. హుటాహుటిన ఆర్డీవో కార్యాలయం, మినీ ఐటీడీఏ, అతిథి గృహాలను మంజూరుచేశారు. వీటిలో కోసం రూ.60 లక్షలు కేటాయిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇంతలో జిల్లా యంత్రాంగానికి పోలవరం ముంపు గుర్తుకొచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దుచేశారు. దీంతో ఇక్కడ తగిన వసతులు సమకూరక ఐటీడీఏకు డివిజన్ కేంద్రాన్ని మార్చాల్సిన దుస్థితి తలెత్తింది. దాదాపు ఏడేళ్లపాటు నిర్జీవంగా కొనసాగిన ఈ డివిజన్ మరో రెండు నెలల్లో తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.