logo

ధరలకు బెదిరి... ఆశలు చెదిరి!

ఏడాది పాటు కంటికిరెప్పలా కాపుగాసి పండించుకున్న పంట తీరా చేతికందే సమయంలో వాతావరణం ఒక వైపు, ధరలు, దళారులు మరోవైపు ముప్పేట దాడి చేయగా..

Published : 04 Jun 2023 02:32 IST

ఉర్లగట్టుపోడు-బంగ్లామిట్ట గ్రామాల సమీపంలో పారబోసిన మామిడికాయలు

డాది పాటు కంటికిరెప్పలా కాపుగాసి పండించుకున్న పంట తీరా చేతికందే సమయంలో వాతావరణం ఒక వైపు, ధరలు, దళారులు మరోవైపు ముప్పేట దాడి చేయగా.. ఫలరాజును నమ్ముకున్న రైతులు వాటిని ఇలా రోడ్డు పక్కన మైదానాలలో పారబోస్తున్నారు. రైల్వేకోడూరు మార్కెట్‌ యార్డులో బేనీషా, రుమాణి, నాటు రకాల మామిడి కాయలు టన్ను రూ.15 వేలు కూడా దాటడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కాయలపై మచ్చలు రావడంతో వాటి ధరలు టన్ను రూ.5 వేల లోపే పలుకుతున్నాయి. దీంతో కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులకు కూడా రావట్లేదని రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు. వాటిలో నాణ్యమైన కాయలను స్థానికులు ఏరుకుని పట్టుకెళ్తున్నారు.    

న్యూస్‌టుడే, రైల్వేకోడూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని