కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు
మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థులకు సూచనలు
రేపు భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి రాక
చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెదేపా తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థి జయచంద్రారెడ్డి దంపతులు, పక్కన మదనపల్లె నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తదితరులు
ఈనాడు, కడప: మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మదనపల్లె, తంబళపల్లె అభ్యర్థుల గెలుపుపై ప్రత్యేకంగా సమాలోచనలు జరిపారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, తెదేపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల అభ్యర్థులు నల్లారి కిషోర్కుమార్రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, నాయకులు బాలసుబ్రహ్మణ్యం. మల్లికార్జుననాయుడు, బత్యాల చెంగల్రాయుడు, రూపానందరెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు తదితరులతో భేటీ అయ్యారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల అభ్యర్థులు షాజహాన్బాషా, జయచంద్రారెడ్డితో వేర్వేరుగా మాట్లాడారు. జయచంద్రారెడ్డి దంపతులతో మాట్లాడుతూ తంబళ్లపల్లెలో గెలుపు అవకాశాలున్నాయని, అందరినీ కలుపుకొంటూ వ్యూహంతో ముందడుగేయాలని ఆదేశించారు. మీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడా రాజీపడకుండా గెలుపునకు ఎత్తులు వేయాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని గట్టిగా సూచించారు. షాజహాన్బాషాకు సైతం పలు సూచనలు చేశారు. ఏలోటొచ్చినా పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. టిక్కెట్ రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, పార్టీ నేత రాటకొండ బాబురెడ్డితో పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు మాట్లాడిన అనంతరం వారి అభిప్రాయాలను చంద్రబాబుకు వివరించారు. పార్టీ ఎన్నో ఒడిదొడుకులు చూసిందని, పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, నష్టం చేసేవారిని గుర్తు పెట్టుకుంటుందని కఠినంగా హెచ్చరించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్ చంద్రబాబును కలిశారు. రాజకీయంగా నీ భవిష్యత్తుకు ఏలోటు రాదని, పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై కీలక నేతలతో చర్చించారు. సామాజిక సమతుల్యతపై కసరత్తు చేశారు. ఇదిలా ఉండగా భాజపా రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడ నుంచి మదనపల్లెకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి స్వగ్రామం కలికిరి మండలం నగిరిపల్లెకు చేరుకుని తెదేపా, భాజపా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, గెలుపు వ్యూహాలపై పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులతో చర్చించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
[ 28-04-2024]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది. -
యువత మరణాలు వైకాపా ప్రభుత్వ హత్యలే!
[ 28-04-2024]
‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు. -
ఎస్ఆర్బీసీ... తుంగలో తొక్కేసి..!
[ 28-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. -
నా అనుకున్న వాళ్లే మోసం చేశారు
[ 28-04-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. -
పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
కూటమి జోష్!
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది. -
ఒట్టేసి ఒక మాట... ఓటేశాక ఒక మాట..!
[ 28-04-2024]
‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. -
జగన్ ఝలక్... కరెంట్ షాక్!
[ 28-04-2024]
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. -
జగన్ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే
[ 28-04-2024]
ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు
[ 28-04-2024]
తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. -
క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం
[ 28-04-2024]
ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!