తిరగకుంటే.. ఎలా..!
ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది. ఇది కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ప్రయాణికులు తక్కువున్నారంటూ అధికారులు కొన్ని రూట్లలో ఏకంగా బస్సులనే తిప్పడం మానేస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడక తప్పడంలేదు.
ఆదాయం లేదంటూ బస్సులను నడపని ఆర్టీసీ
ప్రైవేటు వాహనాలే శరణ్యం
న్యూస్టుడే, తాండూరు, బొంరాస్పేట: ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది. ఇది కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ప్రయాణికులు తక్కువున్నారంటూ అధికారులు కొన్ని రూట్లలో ఏకంగా బస్సులనే తిప్పడం మానేస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడక తప్పడంలేదు. ఈ రెండు విషయాలనూ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పునఃసమీక్షించాల్సిన అవసరం అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
కి.మీకి.రూ.15 మాత్రమే వస్తోంది
జిల్లాలో ఒక్కో కిలో మీటరుకు రూ.25 చొప్పున సమకూరితేనే ఆర్టీసీకి ఆదాయం వస్తున్నట్లు లెక్క. దీంతోనే సిబ్బంది వేతనాలు, బస్సుల నిర్వహణ, ఇంధన ఖర్చులు పోను ఎంతో కొంత ఆదాయంగా మిగులుతుంది. అయితే పది రోజుల నుంచి కి.మీకు రూ.15 చొప్పున మాత్రమే అతికష్టంగా సమకూరుతుంది.
* జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి డిపోల పరిధిలోని 251 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి నిత్యం 91,000 కి.మీ.వరకు రాకపోకలు నిర్వహిస్తే రూ.27లక్షల ఆదాయం సమకూరుతుంది. ఈనెల 6వ తేదీ నుంచి బస్సుల్లో రాకపోకలు నిర్వహించే ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. ఆదాయం రూ.22లక్షలకు పడిపోయింది. ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈనెల 30వరకు పొడిగించింది. దీనికి తోడు జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైంది. ఈ కారణంగా చాలా మంది రాకపోకలను తగ్గించారు. ఆదాయం పడిపోతోందని 70,000 కి.మీ.వరకే తిప్పుతున్నారు. మిగిలిన 21,000 కి.మీ.మేర బస్సులను రద్దు చేశారు.
* ప్రయాణికుల రద్దీ తగ్గడంతో అధికారులు 27 బస్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. 251 బస్సులకు గాను ప్రస్తుతం 224 మాత్రమే తిరుగుతున్నాయి. పరిగి డిపోలో 9 ఆర్టీసీ, 6 అద్దెబస్సులను, తాండూరు డిపోలో 5 ఆర్టీసీ, వికారాబాద్ డిపోలో 7 ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు.
పూర్తిగా నిలిపేశారు
ప్రతి కిలో మీటరుకు నిర్ణీత ఆదాయం కంటే తక్కువగా వస్తుండడంతో ఇది సంస్థకు నష్టం కలిగించే పరిణామమని కొన్ని బస్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. తాండూరు డిపో పరిధిలోని తాండూరు మండలం నారాయణపూర్, చంద్రవంచ, ఉద్దండాపూరు, పెద్దేముల్ మండలం నాగులపల్లి, జనగాం, మదనంతాపూరు, అడ్కిచర్ల, బషీరాబాద్ మండలం గొట్టిగ కలాన్ రూట్లలో బస్సుల రాకపోకలు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచి పోయాయి. విద్యార్థుల కోసమని ఉదయం, సాయంత్రం వేళల్లో తిరిగే కొద్దిపాటి బస్సులను కూడా ఆపేశారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు లేదంటే సొంత బైక్లపై ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం అధిక మొత్తాలను ఛార్జీలకుగా చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన పరిగి, వికారాబాద్ డిపోల పరిధిలో బస్సులు రద్దయిన రూట్లలోని ప్రయాణికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన వారు ఆటోలు లేదంటే సొంత బైక్లపై రాకపోకలు నిర్వహించాల్సి వస్తోంది.
* మరోవైపు... జిల్లాలో బస్సులు ప్రారంభమయ్యే స్టార్టింగ్ పాయింట్లుగా ఉన్న తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రయాణ ప్రాంగాణాల వద్ద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సు వెళ్లే గమ్యస్థానాలను అరుస్తూ వివరిస్తున్నారు. నిర్ణీత సమయం కంటే ప్లాట్ఫాం వద్ద కొద్దిగా ఎక్కువే సేపే నిలువరిస్తున్నారు. ఇంతచేసినా సరిపడా ప్రయాణికులు రావడం లేదని వాపోతున్నారు.
డిమాండ్కు అనుగుణంగా పునరుద్ధరిస్తాం
- రమేష్, జిల్లా ఆర్టీసీ డివిజనల్ మేనేజరు
కరోనా ప్రభావం వల్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గాయని ప్రాథమికంగా భావిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా మాత్రమే బస్సులను రద్దు చేయాల్సి వచ్చింది. డిమాండ్ పెరగగానే అన్ని బస్సులను అందుబాటులోకి తెస్తాం. బస్సులేదని ఇబ్బంది పడే ప్రయాణికులు తమకు ఫోన్ చేసి తెలియజేస్తే చాలు. పూర్తి వివరాలు తెలుసుకుని తిప్పుతాం. ప్రయాణికుల ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగించాలని కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.