మార్కెట్ కమిటీల గల్లాపెట్టెలు గలగల
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి.
లక్ష్యానికి మించి రుసుముల వసూళ్లు
న్యూస్టుడే, బొబ్బిలి, పార్వతీపురం పట్టణం
బొబ్బిలిలోని మార్కెట్ కమిటీ చెక్పోస్టు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి. మరికొన్ని 200 శాతానికి మించడం విశేషం.
జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఈ ఏడాది రూ.10.43 కోట్ల మార్కెట్ రుసుములు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంతవరకు రూ.12.14 కోట్లు వచ్చాయి. ఇందులో ఇతర పంటల నుంచి వసూలు చేసిన మార్కెట్ రుసుం రూ.5.78 కోట్లు రాగా, పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.6.36 కోట్లు జమకావడంతో ఆ మొత్తానికి చేరుకుంది. ఇది 116 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన నాలుగు రోజుల వ్యవధిలో మరింత మొత్తం వసూలయ్యే అవకాశం ఉంది.
విడుదలయ్యాయి...
వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ కమిటీలు ఒక శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల కమిటీలకు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో అత్యధికంగా పండేది వరి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపట్టడంతో మార్కెట్ రుసుములు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఏటా కమిటీలు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఈ ఏడాది మాత్రం ఆయా బకాయిలు పౌర సరఫరాల నుంచి రూ.6.36 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కో కమిటీకి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ రావడంతో నిధులు సమకూరాయి. దీంతో లక్ష్యం వంద శాతం దాటిపోయింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో మార్కెట్ కమిటీల ఆదాయం లక్ష్యాన్ని మించి సమకూరింది. ఈ ఏడాది లక్ష్యం రూ.7.27 కోట్లకు గానూ రూ.11.91 కోట్లు వసూలు అయినట్లు ఏడీ అశోక్ కుమార్ తెలిపారు.
ప్రణాళికా యుతంగా
- శ్యామ్, ఏడీ, మార్కెటింగ్శాఖ, విజయనగరం.
మార్కెట్ కమిటీలు లక్ష్యాలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాం. చెక్పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసి రవాణా అయ్యే సరకులపై నిబంధనల మేరకు రుసుములు వసూలు చేశాం. ఆన్లైన్లో రుసుముల చెల్లింపుపై అవగాహన కల్పించాం. ట్రేడర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల ఆదాయం మరింత పెరిగింది. పౌరసరఫరాల నుంచి సకాలంలో బకాయిలు విడుదలయ్యాయి. దీంతో లక్ష్యానికి మించి వసూలు చేయగలిగాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ