Issei Sagawa: యువతిని చంపి తిన్న.. ఆ నరమాంస భక్షకుడు మృతి
నాలుగు దశాబ్దాల క్రితం ప్యారిస్లో ఓ యువతిని చంపి ఆమె శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి తీరు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. జపాన్కు చెందిన ఆ వ్యక్తి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు.
టోక్యో: ఓ యువతిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్న ఓ యువకుడి తీరు.. 1980ల్లో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. పారిస్లో జరిగిన ఆ దారుణ ఘటనలో బాధిత యువతి నెదర్లాండ్స్ విద్యార్థి కాగా.. నిందితుడు జపాన్కు చెందిన వ్యక్తి. అయితే, ఆ కేసు నుంచి కొన్ని రోజులకే బయటపడిన అతడు.. ఇన్నేళ్లు స్వేచ్ఛగా తిరిగాడు. నరమాంసమంటే ఎంతో ఇష్టమని చెప్పుకొనే ఆ నరరూప రాక్షసుడు.. ఇటీవల అనారోగ్యం పాలై ఎట్టకేలకు ప్రాణాలు కోల్పోయాడు.
ఇస్సీ సగావా (73).. ఓ కిరాతక హంతకుడిగా జపాన్లో సుపరిచితమే. 1981లో పారిస్లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్వెల్ట్ అనే డచ్ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
1981లో ఈ సంఘటన జరిగింది. అయితే, ఉన్మాది మనస్తత్వం కలిగిన నిందితుడు (Issei Sagawa) విచారణకు అనర్హుడని భావించిన ఫ్రెంచ్ వైద్య నిపుణులు.. 1993లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. అయితే, బాధితురాలి కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు 1994లో సగావాను బహిష్కరించిన ఫ్రాన్స్ అధికారులు, అతడిని జపాన్కు పంపించివేశారు. కానీ, ‘విపరీత ప్రవర్తన’ వల్లే సగావా ఇలా చేస్తున్నాడని.. అతడికి చికిత్స అవసరం లేదని జపాన్ అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్ నుంచి అందకపోవడంతో అది మూతపడిందనే నిర్ధారణకు వచ్చారు. ఇలా కేసు విచారణ అటకెక్కడంతో హంతకుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించాడు.
జైలు శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ.. తన నేరాన్ని మాత్రం సగావా ఎన్నడూ దాచుకోలేదు. తనపై వచ్చిన అపఖ్యాతినే పెట్టుబడిగా పెట్టుకొని తన సొంత అనుభవాలను వ్యాసాల రూపంలో బహిరంగపరిచేవాడు. తాను చేసిన హత్యకు సంబంధించిన వివరాలనూ అందులో స్పష్టంగా వివరించాడు. తాను చేసిన దారుణంపై ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. మహిళలు ఎంతో రుచికరంగా ఉంటారంటూ ఓ ఇంటర్వ్యూలోనే బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతటి క్రూరుడైనప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయాడు. నరమాంస భక్షణపై ఆయనకు ఉన్న ఆసక్తి, గతంలో పారిస్లో చేసిన హత్య గురించిన వివరాలతో 2017లో కనిబా(Caniba) అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. చివరకు వృద్ధాప్యంలో తన సోదరుడి వద్ద కాలం గడిపిన సగావా.. శ్వాసకోస ఇబ్బందులతో నవంబర్ 24న చనిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM