PM Modi: లైటింగ్‌ టవర్లపైకి అభిమానులు.. వెంటనే జోక్యం చేసుకున్న ప్రధాని

బొప్పూడిలో ఎన్డీయే కూటమి ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

Updated : 17 Mar 2024 19:08 IST

చిలకలూరిపేట: బొప్పూడిలో ఎన్డీయే కూటమి ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో పలువురు అభిమానులు.. బారికేడ్లు, లైటింగ్‌ టవర్లపైకి ఎక్కారు. అది ప్రమాదకరం కావటంతో ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకున్నారు. దయచేసి కింద దిగాల్సిందిగా యువకులను కోరారు. విద్యుత్‌ తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని మాటలు అర్థం చేసుకోవాలని పవన్‌ కూడా చెప్పటంతో అభిమానులు కిందకు దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు