Chandrababu: పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు

తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూర్‌ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. 

Updated : 22 Mar 2024 18:40 IST

రాపూర్‌: తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూర్‌ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గోనెపల్లి చేరుకుని అక్కడి నుంచి వాహనంలో పెంచలకోన చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఉండవల్లి బయలుదేరారు. ఆయన వెంట ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, హేమలత, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని