భారత్ అబ్బాయి..లండన్ అమ్మాయి..బెల్లంపల్లిలో పెళ్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని వివాహమాడారు.

Published : 04 Apr 2024 14:29 IST

కాసిపేట: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని వివాహమాడారు. బెల్లంపల్లి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. రాజు గత మూడేళ్లుగా లండన్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భారత్‌లోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు..  స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. వివిధ కారణాల వల్ల లండన్‌ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో.. బెల్లంపల్లికి చెందిన ముత్తె వెంకటేశ్‌, లావణ్య దంపతులు కన్యాదానం చేశారు. వివాహానికి హాజరైన వారంతా నూతన దంపతులను ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని