YS Sharmila: కడప జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత పెంపు

వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించే సమయంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.

Published : 08 Feb 2024 16:40 IST

అమరావతి: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. తనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా?’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. షర్మిల అభ్యర్థన మేరకే భద్రత పెంచినట్టు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని