Venkaiah Naidu: వాళ్లను మరవడం మానవ నైజం కాదు: వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్‌ బూత్‌లో ఓటుతో సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

Published : 19 Feb 2024 22:16 IST

విశాఖపట్నం: బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్‌ బూత్‌లో ఓటుతో సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఓ పాఠశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంతే ముఖ్యమని చెప్పారు. విద్యతోనే విలువలతో కూడిన పౌరులుగా తయారవుతారన్నారు. కన్నతల్లిని, మాతృభాషను, జన్మభూమిని, పాఠం చెప్పిన గురువును, చదువు నేర్చుకున్న విద్యాసంస్థను మర్చిపోవడం మానవ లక్షణం కాదని తెలిపారు. అమ్మ అనే మాట అంతరాళం నుంచి వస్తుందని, మమ్మీ అనే మాట పెదవుల నుంచి మాత్రమే వస్తుందన్నారు. మాతృభాష కళ్ల వంటిదని, పరాయి భాష కళ్లద్దాల వంటిదన్నారు. మాతృభాషను మరువొద్దని విద్యార్థులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని