Venkaiah Naidu: ప్యాకేజ్డ్ ఆహారంతో జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులు: వెంకయ్యనాయుడు
క్యాన్సర్, జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్: క్యాన్సర్, జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా వైద్యనిపుణులు ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టులో స్వర్ణ భారత్ ట్రస్టు, కేర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, స్వర్ణభారత్ ట్రస్టు హైదరాబాద్ ఛాప్టర్ కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘క్యాన్సర్ బారిన పడిన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం. నివారణకు వైద్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర చర్యలు తీసుకోవాలి. పొగాకు వాడకం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పొగాకు వాడకం ఎక్కువగా ఉన్నందున ఆ ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే నష్టాలపై వైద్యులు విస్తృతంగా ప్రచారం చేయాలి. మరోవైపు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకోవడం మానేసి దుకాణాల్లో సిద్ధంగా ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్లే రుగ్మతలు పెరిగిపోతున్నాయి. సామాజిక బాధ్యతగా దినపత్రికలు, ప్రచార, ప్రసార సాధనాలు, డిజిటల్ మీడియా కూడా ఆయా అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట