Dwaraka Tirumala: వైకాపా ఎంపీ పుట్టినరోజు వేడుకలు.. అధికారుల తీరుపై భక్తుల విస్మయం
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణ పరిసరాల్లో వైకాపా నేతల హడావిడితో భక్తులు విస్మయానికి గురయ్యారు.
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో వైకాపా నేతల హడావిడితో భక్తులు విస్మయానికి గురయ్యారు. ఎంపీ పుట్టిన రోజు వేడుకలు శేషాచలం కొండపై నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జెండాలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా ద్వారకా తిరుమల ఆలయానికి చేరుకున్నారు. అంతే కాకుండా దేవస్థానానికి చెందిన కల్యాణ మండపంలో ఎంపీ పుట్టినరోజుకు సంబంధించి ఆలయ అధికారులు భోజనాలు ఏర్పాటు చేశారు. వంటలు చేయడం, వడ్డించడం అంతా.. దేవస్థానం సిబ్బందితోనే చేయించారు. ఈ కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన టీషర్టులు ధరించి భోజనాలకు హాజరవ్వడంతో పాటు, పార్టీ జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. అడ్డు చెప్పాల్సిన దేవాదాయశాఖ అధికారులు వారికే వత్తాసు పలికారు.
కల్యాణ మండపాలకు అద్దె చెల్లించకుండా.. ఉచితంగా ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు ఎలా ఇస్తారు? పుట్టినరోజు కార్యక్రమానికి ఆలయ సిబ్బందిని ఎలా వాడుకుంటారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం కొండపై వైకాపా పార్టీ కార్యాలయాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్లు, భోజనాల కార్యక్రమాలు పుణ్యక్షేత్రంలో చేయడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్