రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఒక కంపెనీ ఐపీఓకి (IPO) రావడానికి ముందు చాలా పెద్ద ప్రక్రియే ఉంటుంది. ముందుగా సెబీకి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి. దరఖాస్తులో వ్యాపారానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలి. సెబీకి అందించడమంటే వాటిని బహిర్గతం చేసినట్లే. తద్వారా ఇన్వెస్ట్ చేయబోయే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే, ఇటీవల చాలా కంపెనీలు రహస్య మార్గంలో ఐపీఓకు (Public Issue) దరఖాస్తు చేసుకుంటున్నాయి. అంటే సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం లేదు. మరి దీని వెనకున్న మతలబేంటి? సెబీ ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది? చూద్దాం..
ఏంటీ రహస్య మార్గం..
ఐపీఓకు (IPO) దరఖాస్తు కోసం ప్రాథమిక పత్రాలను సమర్పించేందుకు అనుమతించిన ప్రత్యామ్నాయ మార్గమే ఈ ‘కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్’. సెబీ దీన్ని 2022లో ప్రవేశపెట్టింది. సాధారణంగానైతే ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నప్పుడే ప్రాథమిక పత్రాలన్నింటినీ బహిర్గతం చేస్తారు. కొత్త విధానంలో మాత్రం అలా ఉండదు. ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వరు. సెబీ క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా సవరణలు సూచిస్తే కంపెనీ వాటిని పూర్తి చేస్తుంది. తర్వాత ఐపీఓ తేదీ, ధరల శ్రేణి సహా ఇతర వివరాలను నిర్ణయించిన తర్వాత ప్రాథమిక పత్రాలను పబ్లిక్కు అందుబాటులో ఉంచుతారు.
ఏ కంపెనీలు చేసుకున్నాయి..
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టాటా ప్లే తొలిసారి ఈ మార్గంలో దరఖాస్తు చేసకుంది. తర్వాత ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో సైతం ఆ బాటలోనే పయనించింది. తాజాగా స్విగ్గీ రహస్యంగా పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది.
ప్రయోజనాలివే..
భద్రంగా కీలక సమాచారం: ఆర్థిక వివరాలు, వ్యాపార రహస్యాలు, వ్యూహాలు, న్యాయపరమైన అంశాలు సహా ప్రాథమిక పత్రాల్లో అనేక వివరాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఐపీఓ ప్రారంభించడానికి చాలా సమయం ఉంటుంది. ఈ మధ్యలో కీలక సమాచారమంతా పబ్లిక్లో ఉండడం వల్ల వ్యాపారానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రత్యర్థి సంస్థలు వాటిని కొల్లగొట్టి లబ్ధి పొందే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రహస్య మార్గం వల్ల కీలక సమాచారం బయటకు వెళ్లకుండా ఉంటుంది.
ఐపీఓ రద్దయినప్పుడు..: దరఖాస్తు చేసుకున్న అన్ని కంపెనీలు ఐపీఓకి రావడం లేదు. వివిధ కారణాల వల్ల పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలను పక్కనపెడుతున్నాయి. అలాంటప్పుడు కీలక సమాచారమంతా పబ్లిక్ డొమైన్లో ఉంచితే ప్రయోజనాలు దెబ్బతిన్నట్లే. అదే రహస్య మార్గంలో అయితే ఐపీఓకి వచ్చినప్పుడు మాత్రమే కీలక వివరాలు బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది.
సవరణలకు అవకాశం: ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే సెబీ తెలియజేస్తుంది. కంపెనీ వాటిని సవరించి మరోసారి పత్రాలను సమర్పిస్తుంది. ఇది ఇన్వెస్టర్లలో సందేహాలకు దారితీసే అవకాశం ఉంది. అదే రహస్య మార్గంలో అయితే ఎలాంటి సమాచారం బయటకు రాకముందే సెబీతో చర్చలు జరపొచ్చు. నియంత్రణపరంగా ఏమైనా మార్పులుంటే చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రతికూలతలు..
ఫైలింగ్ను రహస్యంగా ఉంచడం వల్ల కంపెనీలు ఐపీఓకు (IPO) రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మదుపర్లను నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. అలాగే కొత్త మార్గాన్ని ఎంచుకున్న కంపెనీలు మొత్తం మూడు దఫాల్లో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే వ్యయం కూడా ఎక్కువే. ఈ దశలో ఎక్కడ సమాచారం బయటకు లీకైనా ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు దారితీసే ప్రమాదం ఉంది.
ఇతర దేశాల్లోనూ..
అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో రహస్య మార్గంలో ఐపీఓ దరఖాస్తు విధానం అమల్లో ఉంది. తొలుత కంపెనీలు తమ పత్రాలను నియంత్రణ సంస్థల పరిశీలనకు పంపుతాయి. అక్కడ ఆమోదం లభించి ఐపీఓకు వెళ్లాలనుకున్నప్పుడే సమాచారాన్ని బయటకు బహిర్గతం చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు