ప్రాణవాయువు.. మీ చెంతనే
తమంతట తాము ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందిస్తుంటారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడం కోసం సరైన సమయంలో ప్రాణవాయువు అందించడం అత్యంత కీలకం. సాధారణంగా ఆసుపత్రుల్లో
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ గురించి తెలుసా..?
ఇంటర్నెట్డెస్క్: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. మునపటి కంటే తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కొవిడ్ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ, చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేక అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. చాలీచాలనీ సిలిండర్లతో ఆసుపత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు’ వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏంటీ కాన్సంట్రేటర్లు..? ఎలా పనిచేస్తాయి.. ఎక్కడ లభిస్తాయి..? తెలుసుకుందాం..!
పనితీరు ఎలా..
తమంతట తాము ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందిస్తుంటారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడం కోసం సరైన సమయంలో ప్రాణవాయువు అందించడం అత్యంత కీలకం. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇందుకోసం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తారు. నాజల్ కాన్యులా లేదా ఆక్సిజన్ మాస్క్ల ద్వారా ఈ సిలిండర్ల నుంచి రోగులకు ప్రాణవాయువు అందిస్తారు. అచ్చం ఇలా పనిచేసేవే ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు’. చూడటానికి బ్రీఫ్కేస్ లేదా వాటర్ ప్యూరిఫయర్ ఆకారంలో ఉంటాయి. అయితే సిలిండర్లలో నిర్ణీత పీడనంతో ఆక్సిజన్ ఉంటే.. కాన్సంట్రేటర్లు మాత్రం మన చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ను సేకరించి గ్రహించి.. దాన్ని ఫిల్టర్ చేసి, గాఢతను పెంచి రోగులకు చేరవేస్తుంటాయి. అందుకే వీటిని కాన్సంట్రేటర్లుగా పిలుస్తారు. బ్యాటరీ లేదా విద్యుత్తో ఇవి పనిచేస్తాయి.
సిలిండర్లకు.. కాన్సంట్రేటర్లకు తేడా ఏంటి?
పనితీరు పరంగా రెండింటి లక్ష్యం ఆక్సిజన్ అందించడమే. అయితే కాన్సంట్రేటర్లలో నిర్ణీత పీడనంలో ఉన్న ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. దీనికి బలమైన లోహపు ట్యాంక్ అవసరం లేదు. తేలికైన ప్లాస్టిక్తో దీన్ని తయారుచేయడం వల్ల వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. సాధారణంగా ఇంట్లో ఆక్సిజన్ థెరపీ తీసుకునేవాళ్లు వీటిని వినియోగిస్తుంటారు. మరో విశేషమేంటంటే.. గాలి నుంచే ఆక్సిజన్ను గ్రహిస్తుంది గనుక, సిలిండర్ల మాదిరిగా ఇందులో ఎప్పటికీ ఆక్సిజన్ అయిపోదు.
పెరుగుతున్న డిమాండ్..
సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోగులకు ఇంట్లోనే వీటిని ఏర్పాటు చేస్తే పదేపదే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. అంతకుముందు ఇవి పెద్దగా ప్రచారంలో లేవు. అయితే ఇప్పుడు కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత ఎక్కువవుతుండటంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో నెలకు ఐదు నుంచి ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించే తయారీ సంస్థలకు ఇటీవలికాలంలో భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 40వేల పైనే ఉంది. డిమాండ్ను బట్టి ధర పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతికూలతలూ లేకపోలేదు..
ఆక్సిజన్ సిలిండర్లతో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాన్సంట్రేటర్లతో ప్రతికూలతలూ కూడా ఉన్నాయి. ఇందులో పీడనం కలిగిన ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. ప్రతిసారీ ఆక్సిజన్ విడుదల చేయాలంటే కాన్సంట్రేటర్ తప్పనిసరిగా బ్యాటరీ లేదా విద్యుత్పై ఆధారపడాల్సి ఉంటుంది. పవర్ ఉంటే గాలిని ఫిల్టర్ చేసి, సరఫరా చేయడానికి కుదురుతుంది. అంతేగాక, దీని పనితీరు కాస్త సంక్లిష్టంగా ఉండటం కూడా ఒక్కోసారి గందరగోళానికి గురిచేస్తుంది.
అయితే ఏదిఏమైనా.. ప్రస్తుత ఆక్సిజన్ కొరత సమయంలో ఈ కాన్సంట్రేటర్లు కరోనా రోగులకు కాస్త ఊరటనిచ్చే అంశమే అని వైద్యరంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!