Delta Fear: లాక్డౌన్లోకి ఆస్ట్రేలియా నగరాలు!
ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు మరోసారి లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న ప్రధాన నగరాలు
సిడ్నీ: కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన ఆస్ట్రేలియా.. తాజాగా కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లతో వణికిపోతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు మరోసారి లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే సిడ్నీతోపాటు పలు నగరాలు లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తుండగా తాజాగా బ్రిస్బేన్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు కోటి మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రధాన నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలు..
కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్లు ప్రపంచ దేశాలకు అతివేగంగా వ్యాపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 23 కేసులు గుర్తించారు. దీంతో ఇప్పటికే సిడ్నీ, పెర్త్, డార్విన్ నగరాలు లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అదేదారిలో బ్రిస్బేన్ నగరపాలకమండలి వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్రిస్బేన్తో పాటు సమీప తీర ప్రాంతాలైన క్వీన్స్లాండ్ ప్రాంతాల్లోనూ కొవిడ్ కట్టడి ఆంక్షలను విధిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారినుంచి ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. దీంతో చాలాచోట్ల స్థానికంగా వైరస్ క్లస్టర్లు పెరుగుతున్నాయని అన్నారు.
సిడ్నీలో రెండు వారాలు..
క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్యతో ఆస్ట్రేలియా ప్రధాన నగరాలు ఆందోళన చెందుతున్నాయి. సిడ్నీలో కొన్ని రోజుల గడువులోనే 150 కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన సిడ్నీ.. రెండు వారాలపాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. డార్విన్లోనూ కేసుల సంఖ్య పెరగడంతో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. అటు పెర్త్లోనూ వైరస్ తీవ్రత పెరగడంతో నాలుగురోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా వైరస్ కట్టడికి ప్రధాన నగరాలు ఆంక్షల అమలుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ ఆంక్షలు విధిస్తోంది. కేవలం పాజిటివ్ కేసులులేని నగరాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.
వైరస్ వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ..
వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా మొదటినుంచీ కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కొన్నిరోజులపాటు దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయినప్పటికీ కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటికితోడు ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికీ కేవలం ఐదు శాతం కంటే తక్కువ ప్రజలకు వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. దీంతో వ్యాక్సిన్ పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఆస్ట్రేలియావాసులు.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అధికారులకు సూచించారు.
ఇదిలాఉంటే, ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో వైరస్ విజృంభణ అదుపులోనే ఉందని చెప్పవచ్చు. మహమ్మారి వెలుగు చూసిన నాటినుంచి ఇప్పటివరకు అక్కడ 30వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 910 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!