Jammu : ప్రధాని పర్యటనకు ముందు భారీ ఉగ్రదాడి..!
ప్రధాని నరేంద్ర మోదీ మరో రెండు రోజుల్లో జమ్ములో పర్యటించనున్న సమయంలో ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకొంది. జమ్ములో ఓ సైనిక చెక్పోస్టు సమీపంలో
ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోన్న జమ్ముకశ్మీర్.. మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది హతం
ఇంటర్నెట్డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ 2019 తర్వాత తొలిసారి జమ్ములో పర్యటించడానికి 48 గంటల ముందు భారీ ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్ మొదలైంది. జమ్ములో ఓ సైనిక చెక్పోస్టు సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఒక సీఐఎస్ఎఫ్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్ములో ఉగ్రదాడి జరగొచ్చని 21వ తేదీన భద్రతా దళాలకు నమ్మకమైన సమాచారం అందడంతో.. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సును తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ సాయంతో దాడి మొదలుపెట్టారు. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు జమ్ముకశ్మీర్ పోలీసులు కూడా ఉన్నారు.
దాడి సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహమ్మద్ గ్రూపునకు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను నిలిపివేశారు. డ్రోన్లను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ డీజీపీ దల్బీర్ సింగ్ మాట్లాడుతూ ‘‘సుంజ్వాన్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలపై భారీ ఎత్తున దాడి చేయడం కోసం వారు అక్కడ పొంచి ఉన్నారు’’ అని వెల్లడించారు. 2018లో కూడా సుంజ్వాన్లోని సైనిక క్యాంప్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పట్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు ఆ ఘటనలో మరణించారు.
బారాముల్లాలో మరో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో గురువారం ప్రారంభమైన మరో ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబ కమాండర్ యూసఫ్ కంత్రూ కూడా ఉన్నట్లు సమాచారం. ఇతడు పోలీసుల టాప్టెన్ మోస్ట్వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రమూక నక్కినట్లు భ్రదతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టడంతో నలుగురు సైనికులు, ఒక అధికారి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో దళాలు కూడా ఎదురు దాడి ప్రారంభించడంతో ఎన్కౌంటర్ మొదలైంది.
ఎవరీ యూసఫ్ కంత్రూ..
యూసఫ్ కంత్రూ 2005లో ఓవర్ గ్రౌండర్ వర్కర్గా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతడిని అదే ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. 2008లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు 2017లో తిరిగి ఉగ్రవాదుల్లో చేరాడు. అమాయక పౌరులు, పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల హత్యల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హిజ్బుల్ నుంచి లష్కరేలో చేరాడు. బారాముల్లా ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులు గతంలో చాలా దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
2019 ఆగస్టులో 370 అధికరణను ఉపసంహరించుకొన్న తరవాత తొలిసారి ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లా పల్లీ గ్రామం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?