కరోనా కట్టడి: బీసీజీ వ్యాక్సిన్తో ప్రయోజనమే..!
కరోనా వైరస్ సంక్రమణను తగ్గించడంలో బీసీజీ టీకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు.
మరిన్ని పరిశోధనలు అవసరమన్న అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్తో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై కూడా ముమ్మర ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా క్షయ వ్యాక్సిన్ కూడా కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఇవ్వడంలో దోహదపడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వైరస్ సంక్రమణను తగ్గించడంలో బీసీజీ టీకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. తాజాగా ఈ పరిశోధనా పత్రం జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెష్టిగేషన్లో ప్రచురితమైంది.
క్షయ వ్యాధిని అడ్డుకునే లక్ష్యంతో దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచే బీసీజీ టీకాను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్నిదేశాల్లో వీటి వాడకం తగ్గించినప్పటికీ, భారత్ వంటి దేశాల్లో మాత్రం బీసీజీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ను అడ్డుకోవడంలో ఇది ఏ మేరకు పనిచేస్తుందనే విషయంపై విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. పరిశోధనలో భాగంగా కాలిఫోర్నియా సెడార్స్-సినాయ్ ఆసుపత్రిలోని దాదాపు 6వేల మంది ఆరోగ్యకార్యకర్తల రక్తాన్ని సేకరించి కొవిడ్ యాంటీబాడీల గురించి విశ్లేషించారు. అనంతరం వీరి ఆరోగ్య చరిత్రను అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాక్సిన్ తీసుకోని వారికంటే బీసీజీ తీసుకున్న వారిలో దాదాపు 30శాతం మందికి కరోనా వైరస్ సోకలేదని విషయాన్ని గుర్తించారు. బీసీజీ టీకాలు తీసుకోని వ్యక్తుల్లో కంటే టీకా తీసుకున్న కొందరిలో తక్కువ యాంటీబాడీలను గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో కొవిడ్ యాంటీబాడిల స్థాయి తక్కువగా ఉండడానికి ఆ టీకానే కారణమా? అనే విషయంపై స్పష్టత లేదని పరిశోధకుడు మోషే అర్థితి అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే యాంటీబాడీల స్థాయి కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా సంక్రమణను తగ్గించడంలో బీసీజీ ప్రభావం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.
శ్వాసకోశ సమస్యలతో సహా ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బీసీజీ టీకా సమర్థవంతంగా పనిచేస్తుండడంతోనే కరోనాపై పరిశోధనలు ప్రారంభించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఇది కొంత ప్రయోజనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా వైరస్ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు భారీ స్థాయిలో బీసీజీ టీకాపై పరిశోధనలు జరపాల్సిన అవసరాన్ని సెడార్స్-సినాయ్ వైద్యులు సూచిస్తున్నారు.
ఇప్పటికే, అమెరికాలో క్షయవ్యాధితో పాటు బ్లాడర్ క్యాన్సర్ చికిత్సలో బీసీజీ వ్యాక్సిన్ను వాడేందుకు ఎఫ్డీఏ అనుమతి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ ఇది ప్రయోజనకారిగా ఉండడంతో, కరోనా వైరస్పై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. టెక్సాస్ ఎ&ఎం యూనివర్సిటీ, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, సెడార్స్-సినాయ్తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బీసీజీ టీకాపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటు భారత్లోనూ టీబీ టీకాపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. బీసీజీ టీకా వల్ల వయోధికులకు ప్రయోజనం ఉంటుందా? అనే అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా అధ్యయనం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా