మోదీని సాయం అడిగిన గొంతు మూగబోయింది..!
‘‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధనేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్ చెల్లెళ్ల గొంతుకగా మారు. మేము ఈ పోరాటాన్ని సొంతగానే కొనసాగిస్తాము
కెనడాలో కరీమా బలోచ్ హత్య
ఇంటర్నెట్డెస్క్: ‘‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధనేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్ చెల్లెళ్ల గొంతుకగా మీరు మారాలి. మేము ఈ పోరాటాన్ని సొంతంగానే కొనసాగిస్తాము. నువ్వు కేవలం మా ఆవేదనను ప్రపంచానికి తెలియజెయ్యి’’ అంటూ 2016లో రక్షా బంధన్ రోజున భారత ప్రధాని నరేంద్రమోదీకి ఓ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని నాటి ‘బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్’ ఛైర్పర్సన్ కరీమా బలోచ్ రికార్డ్ చేసి తారేక్ ఫతా అనే కెనడా రచయిత యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. అప్పుడు మోదీని సోదరుడితో పోల్చిన ఆ గొంతు నేడు మూగబోయింది. పాక్ ఉక్కుపిడికిలిలోని బలోచిస్థాన్ నుంచి 2016 తప్పించుకొని కెనడాలో శరణార్థిగా జీవిస్తున్న ఆమెను కొందరు వేటాడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నేడు టొరెంటో నగరానికి సమీపంలో కనుగొన్నారు. ఆమె మృతితో 40 రోజులు సంతాప దినాలు పాటించాలని బలోచ్ నేషనల్ మూవ్మెంట్ పిలుపునిచ్చింది. ఈ హత్య వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో స్థిరపడిన పాక్ జనరల్స్ను కరీమా తీవ్రంగా విమర్శించారు. 2016లో బీబీసీ ప్రచురించిన 100మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కరీమా కూడా స్థానం దక్కించుకొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో స్వాతంత్ర దినోత్సవం రోజున బలోచ్ అంశాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది జరిగిన వారం తర్వాత కరీమా సందేశం వచ్చింది.
ఆమె చివరి ట్వీట్ కూడా ఉద్యమం గురించే..
డిసెంబర్ 14న కరీమా తన ట్విటర్ హ్యాండిల్లో చివరి సారి ట్వీట్ చేశారు. బలోచ్ ఉద్యమకారులను రక్షించాలని ఆమె కోరారు. పాక్ సైన్యం తమ వారిని కిడ్నాప్, హత్యలు చేస్తోందని పేర్కొంది. బలోచ్ ఉద్యమకారులు హత్యలకు గురికావడం ఇదే తొలిసారి కాదు. మేలో బలోచ్ జర్నలిస్టు సాజిద్ హుస్సేన్ను స్వీడన్లో పాక్ కిరాయి మూకలు హత్య చేశాయి.
బలోచిస్థాన్లో పరమక్రూరంగా పాక్..!
బలోచిస్థాన్ను బలవంతంగా గుప్పిట పెట్టుకొన్న పాక్.. అక్కడ ఉద్యమకారులను అణచివేస్తోంది. పాక్ సైన్యంతోపాటు డెత్స్క్వాడ్స్ చెలరేగిపోతున్నాయి. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సహకారంతో ఈ బృందాలు పౌరులను, బలోచ్ ఉద్యమకారులను హత్యలు చేస్తుంటాయి. వీటికి పాక్ ఐఎస్ఐ సహాయం చేస్తోంది. పక్కా నేరగాళ్లను ఎంచుకొని ఈ బృందాలను తయారు చేస్తుంది. ఈ డెత్ స్క్వాడ్ల నిర్వాహకులు ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారు. పాక్లోని డెత్స్క్వాడ్లలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి షఫీక్ మెంగల్. ఇతనికి లష్కరే, కశ్మీరీ జిహాదీలతో సంబంధాలు ఉన్నాయి. పాక్లోని ఖుజుదార్ అనే ప్రదేశంలో ప్రైవేటు జైళ్లను నడిపేవాడు. 2014లో ఇతను టూటక్ అనే ప్రదేశం వద్ద నడిపే ఒక ప్రైవేటు జైలు సమీపంలో సామూహిక సమాధులు బయటపడ్డాయి. వాధ్లో ఉగ్రక్యాంపులను కూడా నిర్వహిస్తుంటాడు. ఇతను రాజకీయాల్లోకి వెళ్లడంతో జకీరా మహమ్మద్ హుస్సేని ఈ స్థానాన్ని ఆక్రమించాడు. వీరితోపాటు ఫయాజ్ జంగ్వీ, యూనిస్ మహమ్మద్ షాలు కూడా డెత్స్క్వాడ్లను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలలోనే బలోచిస్థాన్లో 45 కిడ్నాప్లు జరిగాయి. వీటి వెనుక వీరి హస్తం ఉంది. ఇటీవల చనిపోయిన జర్నలిస్టు సాజిద్ హుస్సేన్, అతని కుటుంబ మిత్రుల హత్యల్లో డెత్స్క్వాడ్ల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టును చంపడంలో పాక్ సైన్యం పాత్రకూడా ఉన్నట్లు సమాచారం. గతేడాది పాక్లోని జియో టీవీకి చెందిన హమీద్ మీర్ అనే జర్నలిస్టును సైన్యం మాయం చేసింది.
ఇదీ చదవండి...
యూకే ప్రయాణికుల్లో కరోనా..భారత్ అప్రమత్తం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!