మళ్లీ చెబుతున్నా.. ఇస్రో ప్రైవేటీకరణ జరగదు! 

అంతరిక్ష పరిశోధనా రంగంలో  కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ స్పందించారు. ఇస్రోను ప్రైవేటీకరిస్తారంటూ వస్తోన్న అపోహలను ఆయన ......

Updated : 20 Aug 2020 18:30 IST

వెబినార్‌లో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా రంగంలో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ స్పందించారు. ఇస్రోను ప్రైవేటీకరిస్తారంటూ వస్తోన్న అపోహలను ఆయన తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు తేనున్నట్టు కేంద్రం ప్రకటించగానే ఇస్రోను ప్రైవేటీకరిస్తారనే కోణంలో అనేక అపోహలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గురువారం శివన్‌ ఓ వెబినార్‌లో మాట్లాడుతూ.. కేంద్రం సంస్కరణలు ప్రకటించగానే ఇస్రోను ప్రైవేటీకరిస్తారనే అపోహలు వచ్చాయని.. అది సరికాదన్నారు. ఇస్రో ప్రైవేటీకరణ జరగదని మళ్లీ మళ్లీ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు భారతీయ అంతరిక్ష రంగంలో నిజమైన గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని శివన్‌ అభిప్రాయపడ్డారు.

అంతరిక్ష కార్యకలాపాల్లో మెరుగైన ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన బిల్లు దాదాపు తుది దశలో ఉందన్న శివన్‌.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం త్వరలోనే వారి ముందు పెడతామని చెప్పారు. వాస్తవానికి ఇస్రో కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. సాధారణ ఉత్పాదక కార్యకలాపాల కంటే భిన్నంగా వనరులను మరింతగా ఉపయోగించుకొని ఇస్రో మరింత ముందుకెళ్తుందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని