జనవరిలో చైనాకు నిపుణుల బృందం:  WHO

కొవిడ్‌-19 పుట్టుకపై విచారించేందుకు వచ్చే జనవరిలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాను సందర్శించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బుధవారం అధికారికంగా వెల్లడించింది.

Updated : 16 Dec 2020 18:50 IST

దిల్లీ: కొవిడ్‌-19 పుట్టుకపై విచారించేందుకు వచ్చే జనవరిలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాను సందర్శించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బుధవారం అధికారికంగా వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి హెడిన్‌ హాల్‌డర్సన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరిలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు చెప్పారు. వారు వైరస్‌ ఎక్కడ పుట్టిందనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఏడాది కాలం పూర్తైంది. ఇప్పటివరకూ ఆ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా బాధితులను బలితీసుకుంది. అంతేకాకుండా ఏడు కోట్లకు పైగా జనం దాని బారిన పడ్డారు. అయితే ఈ వైరస్‌ ఎక్కడ పుట్టింది? అనే విషయం మాత్రం సర్వత్రా మిస్టరీగా ఉండిపోయింది. ఆ విషయాల్ని కనుగొనేందుకు చైనాకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పంపే విషయమై డబ్ల్యూహెచ్‌వో నెలల తరబడి పనిచేస్తోంది.  

కాగా ఐరాస ఆరోగ్య విభాగం వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేపట్టేందుకు ఇప్పటికే జులైలో ఓ బృందాన్ని బీజింగ్‌కు పంపిన విషయం తెలిసిందే. మొదట పరిశోధకులు చైనాలోని వుహాన్‌లోని విదేశీ జంతు మాంస విక్రయ మార్కెట్లో.. వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తికి ఆ మార్కెట్‌ కారణం కాకపోవచ్చు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి

చుక్కలు కలిసిన ఆ రాత్రి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని