ఉగ్ర జాబితా నుంచి 4వేల మందిని తొలగించిన పాక్!
ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్ విషయంలో జోక్యం చేసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారత్ మరోసారి ధీటైన జవాబిచ్చింది. భారత్కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, ఉగ్ర మూకలకు మద్దతుగా పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను ఐరాస మానవ హక్కుల మండలి ముందు బట్టబయలు చేసింది.
ఐరాసలో పాక్కు ధీటుగా బదులిచ్చిన భారత్
దిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్ విషయంలో జోక్యం చేసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారత్ మరోసారి ధీటైన జవాబిచ్చింది. భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, ఉగ్ర మూకలకు మద్దతుగా పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను ఐరాస మానవ హక్కుల మండలి ముందు బట్టబయలు చేసింది. అంతేకాకుండా మైనారిటీల విషయంలో పాక్ అనుసరిస్తున్న తీరును కూడా భారత్ ఎండగట్టింది. ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాటంలో నిమగ్నమై ఉంటే పాక్ మాత్రం 4వేల మంది ఉగ్రవాదులను జాబితా నుంచి తొలగించి, వారికి స్వర్గధామంగా మారిందని ఆదేశానికి బదులిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత ప్రతినిధి పవన్ బాదే సమావేశంలో ప్రసంగించారు.
‘భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ స్థాయిలో ఉగ్ర శిక్షణ శిబిరాలు, ఉగ్ర స్థావరాలు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాటంలో నిమగ్నమై ఉంటే.. పాక్ మాత్రం ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు గానూ 4వేల మందికి పైగా అంతర్జాతీయ ఉగ్రవాదులను జాబితా నుంచి తొలగించింది’ అని పవన్ బాదే తెలిపారు. కాగా పాక్ను ఎఫ్ఏటీఎఫ్(ఆర్థిక చర్యల కార్యదళం)లో బ్లాక్ లిస్టులో చేర్చాలా వద్దా అనే అంశంపై అక్టోబర్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం పాక్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో ఉంది.
ఐరాసలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇమ్రాన్ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని ఆరోపించారు. దీంతో భారత్ స్పందిస్తూ.. పాకిస్థాన్ బయటి నుంచి పీఓకేలోకి వ్యక్తుల్ని పంపించి అక్కడి జనాభాను మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. పీఓకేలో ఉండే ప్రతి నలుగురిలో ముగ్గురు బయటి నుంచి వచ్చిన వారే ఉంటారని పేర్కొంది. ఇదంతా పాక్ చేస్తున్న కుట్రగానే భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా పాక్ను మైనార్టీల హత్యా క్షేత్రంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయని.. ప్రతి సంవత్సరం వందలాది మైనారిటీలు అక్కడ హింసకు గురవుతూనే ఉన్నారని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్