ఆ లేఖ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది: పవార్‌

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాసిన లేఖపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తీవ్రంగా స్పందించారు. గవర్నర్‌ లేఖలో ప్రస్తావించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు.

Published : 14 Oct 2020 01:58 IST

దిల్లీ: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాసిన లేఖపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తీవ్రంగా స్పందించారు. గవర్నర్‌ లేఖలో ప్రస్తావించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ‘సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ కోశ్యారీ ఉపయోగించిన భాషను మీరు కూడా తప్పక గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మన రాజ్యాంగంలో లౌకిక అనే పదం అన్ని మతాల్ని, వర్గాల్ని సమానత్వం కల్పిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగంలోని ఆయా పదాలను సమర్థించాలి. కానీ, దురదృష్టవశాత్తూ గవర్నర్‌ కోశ్యారీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఓ రాజకీయ నాయకుడికి రాసినట్లుగా ఉంది. దేవాలయాల పునఃప్రారంభానికి సంబంధించిన విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకురావడంపై నేను ఏకీభవిస్తున్నాను. ఆ విషయంలో గవర్నర్‌కు స్వతంత్ర అభిప్రాయాలు ఉండటంలో తప్పులేదు. కానీ ఆయన లేఖలో ఉపయోగించిన భాష మాత్రం నన్ను ఎంతో షాక్‌కు గురిచేసింది’ అని పవార్‌ ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. మహారాష్ట్రలో ఆలయాలను తెరవడం గురించి గవర్నర్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య లేఖల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. 

ఉద్ధవ్‌జీ.. లౌకికవాదిగా మారారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని