ప్రాణాలు కాపాడుతోన్న స్టెరాయిడ్లు!
ప్రాణాపాయస్థితిలో ఉన్న కొవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటంలో కొంతవరకు స్టెరాయిడ్లు పనిచేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది.
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో మెరుగైన ఫలితాలు
సిఫార్సు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
వాషింగ్టన్: మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్కు ఇప్పటికీ కచ్చితమైన చికిత్స లేదు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్ రోగులను రక్షించేందుకు ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివిధ రకాల మందులను వాడుతున్నారు. వీటిలో చౌకగా లభించే కార్టికో స్టెరాయిడ్ మాత్రలు ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడుతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై జరిగిన ఏడు పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న కొవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటంలో కొంతవరకు స్టెరాయిడ్లు పనిచేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. వెంటిలేటర్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు ఇవి ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది.
కరోనావైరస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే మలేరియాకు వాడే మందులతో సహా మరికొన్ని స్టెరాయిడ్లను కూడా అందిస్తున్నారు. అదే సమయంలో కొవిడ్ వైరస్ను ఈ మందులు ఎంతవరకు ఎదుర్కొంటున్నాయనే విషయంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కార్టికో స్టెరాయిడ్లు ప్రాణాపాయస్థితి నుంచి కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడుతున్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు. దీన్ని జర్నల్ ఆఫ్ అమెరికా మెడికల్ ఆసోసియేషన్(జామా) కూడా ప్రచురించింది. ముఖ్యంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న (ఆక్సిజన్ సహాయం అవసరమయ్యే) రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నట్లు నిపుణులు తేల్చారు. వీటిలో హైడ్రోకార్టిసోన్, డెక్సామెథాసోన్, మిథైల్ ప్రెడ్నీసొలోన్ వంటి కార్టికో స్టెరాయిడ్ మాత్రలు తక్కువ డోసులో ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న కొవిడ్ రోగులు స్టెరాయిడ్లు వాడవచ్చని సిఫార్సు చేసింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలు మెరుగైన ఫలితాలు ఇవ్వడం ఊరటకలిగించే విషయమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన డాక్టర్ మార్టిన్ లాండ్రీ పేర్కొన్నారు. వ్యాధిని పూర్తిగా నయం చేయకపోయినప్పటికీ..తక్కువ ఖర్చులో లభించే ఈ స్టెరాయిడ్లు ఆశాజనక ఫలితాలు ఇవ్వడం ఎంతో ఉపశమనం కలిగించే విషయమని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన డాక్టర్ ఆంథోని గార్డన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ తాజా ఫలితాలు కొవిడ్ చికిత్సలో మరో మైలురాయి అని అభివర్ణించారు. ముఖ్యంగా శ్వాసకోస భాగాల్లో ఏర్పడే వాపులను నియంత్రించి, రోగి ప్రాణాలను కాపాడటంలో ఈ స్టెరాయిడ్లు బాగా పనిచేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్రిటన్, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వచ్చాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే స్వల్ప లక్షణాలున్న వారు ఈ స్టెరాయిడ్లు వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులను ప్రాణాలను రక్షించడంలో డెక్సామెథాసోన్ కీలకంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ జరిపిన పరిశోధనల్లో తేలింది. ఆక్సిజన్ అవసరమవుతున్న కొవిడ్ రోగులకు ఈ మందులు వాడడంతో దాదాపు 35శాతం మంది రోగులు మరణాల నుంచి బయటపడుతున్నట్లు గుర్తించారు. మరో ఔషధం రెమిడెసివిర్ కూడా వాడవచ్చని ఇప్పటికే అమెరికా మందుల నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. వీటితోపాటు అత్యవసర సమయాల్లో స్టెరాయిడ్ల వాడకానికి ఆయా దేశాలు అనుమతిస్తున్నాయి.
ఇవీ చదవండి..
భారత్లో కరోనా కల్లోలం: రికార్డుస్థాయి కేసులు
నవంబర్ 1 కల్లా అమెరికాలో వ్యాక్సిన్ సిద్ధం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?