ఆ రెండు దేశాల నుంచే ఎక్కువ కేసులు!
భారత్లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్లో వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది.
దిల్లీ: భారత్లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్లో వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా దుబాయ్, యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఐఐటీ-మండీ విశ్లేషణాత్మక అధ్యయనం పేర్కొంది. ట్రావెల్ మెడిసిన్ జర్నల్లో ఈ తాజా అధ్యయనం ప్రచురితమైంది.
విదేశాల నుంచి భారత్కు వైరస్ ఎలా వ్యాపించింది? అనే విషయంపై హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటీ-మండీ పరిశోధకులు దృష్టిపెట్టారు. తద్వారా భారత్లో వైరస్ వ్యాప్తికి ముఖ్యకారణమైన కొందరు సూపర్ స్ప్రెడర్లను గుర్తించారు. రోగుల ప్రయాణచరిత్ర ఆధారంగా వారిని ధృవీకరించుకున్నారు. ఇలా ఆ రెండు దేశాలనుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు వచ్చాయని..అనంతరం దేశంలోకి ప్రవేశించిన తర్వాత స్థానికంగా వైరస్ వ్యాప్తి ఎక్కువైనట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సరితా ఆజాద్ వెల్లడించారు.
వైరస్ సోకిన వారి జనవరి నుంచి ఏప్రిల్ ప్రయాణ చరిత్రను పరిశోధనా బృందం సేకరించింది. దీని ఆధారంగా వైరస్ గురించిన పూర్తి వివరాలతో సోషల్ నెట్వర్క్ను ఏర్పాటుచేశారు. వీరిలో ఎక్కువగా దుబాయ్(144), యూకే(64) నుంచి వచ్చినవారే ఉన్నట్లు పరిశోధనలో తేలిందని సరితా వెల్లడించారు. భారత్లో వైరస్ వ్యాప్తికి ఈ రెండు దేశాలనుంచి వచ్చిన వారే కీలకంగా వ్యవహరించినట్లు ఆమె స్పష్టంచేశారు.
అయితే, వివిధ రాష్ట్రాల్లో వేరువేరు సమూహాలుగా వైరస్ వ్యాపించింది. మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్త లాక్డౌన్ కాలంలో తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదైంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ కశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. ఈ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వైరస్ వ్యాపించినట్లు వెల్లడైంది. అయితే, తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల నుంచి వైరస్ ఇతర రాష్ట్రాలకు సోకడంలో తక్కువ పాత్ర పోషించాయని పరిశోధనా బృందం పేర్కొంది. భారత్లో ఈ మహమ్మారి ప్రారంభ దశలో వైరస్వ్యాప్తి ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు తాజా పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుందని సరితా ఆజాద్ అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరింది. వీరిలో 94వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?