Shraddha Murder: హత్య తర్వాత.. శ్రద్ధా ఫోన్తోనే ముంబయి విచారణకు ఆఫ్తాబ్..!
శ్రద్ధా వాకర్ను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆఫ్తాబ్ ఆమె ఫోన్ను కొన్ని నెలల పాటు ఉపయోగించినట్లు తాజాగా తెలిసింది. ముంబయిలో విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోన్ను తీసుకెళ్లినట్లు సమాచారం.
దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. శ్రద్ధాను చంపేసిన తర్వాత నిందితుడు ఆఫ్తాబ్ ఆమె ఫోన్ను కొన్ని నెలల పాటు తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ముంబయిలో పోలీసు విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోన్ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.
మే 18న శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు ముంబయిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవంబరు 3న ఆఫ్తాబ్ను ముంబయికి పిలిచి ప్రశ్నించారు. ఈ విచారణ సమయంలో శ్రద్ధా ఫోన్ అతడి వద్దే ఉందని తాజాగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్తో తాను దొరికిపోతానని భావించిన నిందితుడు.. ముంబయి నుంచి దిల్లీకి తిరిగి వస్తుండగా.. సముద్రంలో విసిరేశాడు. ఫోన్ను సముద్రంలో పడేశానని ఆఫ్తాబ్.. నార్కో పరీక్షలో కూడా చెప్పినట్లు సమాచారం. ఫోన్తో పాటు హత్యకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా నిందితుడు సముద్రంలో విసిరేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఇక హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్తాబ్ ముంబయికి వెళ్లాడు. శ్రద్ధా తనకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిందని స్నేహితులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆఫ్తాబ్.. శ్రద్ధా క్రెడిట్ కార్డు బిల్లులను కూడా ఆమె ఫోన్తోనే చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఆఫ్తాబ్కు డిసెంబరు 1న నార్కో పరీక్ష పూర్తి చేశారు. అంతకుముందు పాలిగ్రాఫ్ పరీక్ష కూడా జరిగింది. అయితే ఈ రెండు పరీక్షల్లోనూ ఆఫ్తాబ్ ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు పోలీసు కస్టడీలో చెప్పిన విషయాలనే ఈ పరీక్షల్లోనూ చెప్పాడని సమాచారం. దీంతో అతడు ఈ పరీక్షల కోసం ముందుగానే రిహార్సల్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక వస్తేనే గానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పించట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!