అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రోడ్డు ట్రాన్స్పోర్టు సంస్థ నంబర్ కేటాయిస్తుంటుంది. అవి కాకుండా తమకు నచ్చిన నంబర్ కేటాయించాలంటూ సంస్థకు భారీగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ, ఆఫ్గానిస్థాన్లో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఏ నంబర్
ఇంటర్నెట్ డెస్క్: వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రోడ్డు ట్రాన్స్పోర్టు సంస్థ నంబర్ కేటాయిస్తుంటుంది. అవి కాకుండా తమకు నచ్చిన నంబర్ కేటాయించాలంటూ వాహనదారులు భారీగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ, అఫ్గానిస్థాన్లో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఏ నంబర్ ఇచ్చినా పర్వాలేదు ‘39’ నంబర్ను మాత్రం ఇవ్వకండి అని ఆర్టీఏ అధికారులను కోరుతున్నారు. ఆ నంబర్ కేటాయించొద్దని అధికారులకు లంచాలు కూడా ఇస్తున్నారట అక్కడి ప్రజలు. గత కొన్నేళ్లుగా అఫ్గానీయులు ఆ నంబర్ను చూస్తే జంకుతున్నారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా వాహనాలకు కేటాయించిన ‘39’ సిరీస్ నంబర్లను తొలగించాలని నిర్ణయానికి వచ్చేసింది. ఇంతకీ ఆ నంబరంటే వారికి ఎందుకంతా భయం?
అఫ్గానిస్థాన్లో ‘39’ నంబర్తో కూడిన వాహనం కనిపించినా, మొబైల్ నంబర్ ఉన్నా వాటి యజమానులకు తీవ్ర అవమానాలు ఎదురవుతాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు ‘39’ నంబర్ను ఒక అసహ్యమైన నంబర్గా భావిస్తారు. దీని వెనుక పలు వాదనలు ఉన్నాయి. దేశంలోని హేరట్ అనే నగరంలో వేశ్యలతో వ్యభిచార గృహాలను నిర్వహించే ఒక క్రూరమైన వ్యక్తి ఉంటున్నాడట. అతడిని ‘39’ అని పిలుస్తుంటారు. అతడు వినియోగించే కార్ల నంబర్ప్లేట్లలోనూ 39 ఉంటుంది. అయితే, అఫ్గాన్లో వ్యభిచారం చేయడం, వేశ్యగా మారడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీంతో వ్యభిచారం నిర్వహించే వారు ఉపయోగిస్తున్న కార్ల నంబర్లను సామాన్య ప్రజలు వినియోగించడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడైనా ఆ నంబర్ ఉన్న కార్లలో అమ్మాయిలు వెళ్తే ఆకతాయిలు వెంటపడటం, మరికొందరు దూషించడం చేస్తుంటారట. అలా ‘39’ను అసహ్యించుకోవడం హేరట్ నగరంలో ప్రారంభమై దేశమంతటా వ్యాపించింది. ఆ నంబర్ కలిగి ఉన్నారంటే వారు వ్యభిచారం చేసేవాళ్లు, చేయించేవాళ్లు అని ముద్ర వేసేశారు.
అయితే, కొన్నాళ్ల కిందట దేశంలోని వాహనాల రిజిస్ట్రేషన్ ఐదు డిజిట్ల నంబర్ సిరీస్ 38 నుంచి 39కి సిరీస్కి మారింది. దీంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. అవమానాలు భరించలేక చాలా మంది ఆ నంబర్ ఉన్న వాహనాలను సెకెండ్హ్యాండ్ కార్ల సంస్థలకు తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. అయితే, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావట్లేదు. కొత్తగా వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో 39 సిరీస్ నంబర్ కేటాయించొద్దని అధికారులకు ప్రజలు లంచాలు కూడా ఇస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆ సిరీస్ను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. త్వరలో సిస్టమ్లో 39 నంబర్ను పూర్తిగా తొలగించనున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ