అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రోడ్డు ట్రాన్స్పోర్టు సంస్థ నంబర్ కేటాయిస్తుంటుంది. అవి కాకుండా తమకు నచ్చిన నంబర్ కేటాయించాలంటూ సంస్థకు భారీగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ, ఆఫ్గానిస్థాన్లో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఏ నంబర్
ఇంటర్నెట్ డెస్క్: వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రోడ్డు ట్రాన్స్పోర్టు సంస్థ నంబర్ కేటాయిస్తుంటుంది. అవి కాకుండా తమకు నచ్చిన నంబర్ కేటాయించాలంటూ వాహనదారులు భారీగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ, అఫ్గానిస్థాన్లో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఏ నంబర్ ఇచ్చినా పర్వాలేదు ‘39’ నంబర్ను మాత్రం ఇవ్వకండి అని ఆర్టీఏ అధికారులను కోరుతున్నారు. ఆ నంబర్ కేటాయించొద్దని అధికారులకు లంచాలు కూడా ఇస్తున్నారట అక్కడి ప్రజలు. గత కొన్నేళ్లుగా అఫ్గానీయులు ఆ నంబర్ను చూస్తే జంకుతున్నారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా వాహనాలకు కేటాయించిన ‘39’ సిరీస్ నంబర్లను తొలగించాలని నిర్ణయానికి వచ్చేసింది. ఇంతకీ ఆ నంబరంటే వారికి ఎందుకంతా భయం?
అఫ్గానిస్థాన్లో ‘39’ నంబర్తో కూడిన వాహనం కనిపించినా, మొబైల్ నంబర్ ఉన్నా వాటి యజమానులకు తీవ్ర అవమానాలు ఎదురవుతాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు ‘39’ నంబర్ను ఒక అసహ్యమైన నంబర్గా భావిస్తారు. దీని వెనుక పలు వాదనలు ఉన్నాయి. దేశంలోని హేరట్ అనే నగరంలో వేశ్యలతో వ్యభిచార గృహాలను నిర్వహించే ఒక క్రూరమైన వ్యక్తి ఉంటున్నాడట. అతడిని ‘39’ అని పిలుస్తుంటారు. అతడు వినియోగించే కార్ల నంబర్ప్లేట్లలోనూ 39 ఉంటుంది. అయితే, అఫ్గాన్లో వ్యభిచారం చేయడం, వేశ్యగా మారడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీంతో వ్యభిచారం నిర్వహించే వారు ఉపయోగిస్తున్న కార్ల నంబర్లను సామాన్య ప్రజలు వినియోగించడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడైనా ఆ నంబర్ ఉన్న కార్లలో అమ్మాయిలు వెళ్తే ఆకతాయిలు వెంటపడటం, మరికొందరు దూషించడం చేస్తుంటారట. అలా ‘39’ను అసహ్యించుకోవడం హేరట్ నగరంలో ప్రారంభమై దేశమంతటా వ్యాపించింది. ఆ నంబర్ కలిగి ఉన్నారంటే వారు వ్యభిచారం చేసేవాళ్లు, చేయించేవాళ్లు అని ముద్ర వేసేశారు.
అయితే, కొన్నాళ్ల కిందట దేశంలోని వాహనాల రిజిస్ట్రేషన్ ఐదు డిజిట్ల నంబర్ సిరీస్ 38 నుంచి 39కి సిరీస్కి మారింది. దీంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. అవమానాలు భరించలేక చాలా మంది ఆ నంబర్ ఉన్న వాహనాలను సెకెండ్హ్యాండ్ కార్ల సంస్థలకు తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. అయితే, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావట్లేదు. కొత్తగా వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో 39 సిరీస్ నంబర్ కేటాయించొద్దని అధికారులకు ప్రజలు లంచాలు కూడా ఇస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆ సిరీస్ను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. త్వరలో సిస్టమ్లో 39 నంబర్ను పూర్తిగా తొలగించనున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో ఈసారి అత్యధికులు కోటీశ్వరులేనట. 80శాతం ఎమ్మెల్యేలకు రూ.కోటి కంటే ఎక్కువే ఆస్తులున్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. -
Amit Shah: పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్: హోంమంత్రి అమిత్ షా ప్రకటన
Amit Shah: పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని.. అందుకే అక్కడ సీట్లను రిజర్వ్ చేసి పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. -
Arvind Kejriwal: ఆప్ పథకాలనే కాపీ కొడుతున్నారు: కేజ్రీవాల్
ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి దేశంలో కొన్ని పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. -
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి హద్దుదాటి వ్యాఖ్యలు చేశాడు. భారత్లో దాడి చేస్తామంటూ బెదిరించాడు. -
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ.. రాజకీయాలపై ఆయన పరిణతి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఈ విషయాలను ఆయన కుమార్తె తన పుస్తకంలో ప్రస్తావించారు. -
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
డీఏంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ మౌనంగా ఉండటంపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. -
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
Websites: పార్ట్టైం జాబ్ మోసాలు.. 100కి పైగా వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
More than 100 websites blocked: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధించింది. పార్ట్టైం జాబ్ మోసాలు, మోసపూరిత పెట్టుబడులను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. -
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం
అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. -
‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్
ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్ నాయక్ ‘బిలియనీర్ ఫార్మర్’ అవార్డును దక్కించుకున్నారు. -
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రసారాలు నిలిపివేత
కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. -
భూ కక్ష్యలోకి తిరిగొచ్చిన చంద్రయాన్-3 మాడ్యూల్
అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువతచ్చింది. -
‘అపోలో కిడ్నీ రాకెట్’పై విచారణకు కేంద్రం ఆదేశం
దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. -
పౌరసత్వం మంజూరైన అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. -
రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్
పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మనీలాండరింగ్ నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. -
డీప్ఫేక్ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం
తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. -
కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
INDw vs ENGw: ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్లో ఓడిన భారత్
-
ప్రకాశం జిల్లాలో దారుణం.. పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
-
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
-
SI Exam Results: ఏపీలో ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల
-
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు