ఈ నెల 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

పార్లమెంట్‌ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడతగా...

Published : 05 Jan 2021 18:02 IST

దిల్లీ: పార్లమెంట్‌ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడతగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణులు, వాణిజ్యవేత్తలతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ భేటీ అయ్యారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై కేంద్ర కేబినెట్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వార్షిక బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో 29న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని