India-China: సైనిక దినోత్సవం రోజున చైనాకు ఘాటు హెచ్చరికలు
దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుయుక్తుల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె పునరుద్ఘాటించారు....
కుయుక్తుల్ని తిప్పికొడతాం : నరవణె
దిల్లీ: దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుయుక్తుల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె పునరుద్ఘాటించారు. భారత్ ఎల్లవేళలా శాంతినే కాంక్షిస్తుందని.. అది బలం నుంచి పుట్టిన ఆకాంక్షేనని స్పష్టం చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఆయన పరోక్షంగా చైనాను ఘాటుగా హెచ్చరించారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకొంటారు. 1949లో బ్రిటిష్ వారి నుంచి భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ఈరోజును జరపుకొంటున్నారు.
సమానత్వం, పరస్పర భద్రత సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న నిబంధనల ద్వారానే వివాదాల పరిష్కారం జరుగుతుందని నరవణె స్పష్టం చేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో గత కొన్ని ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఆర్మీ ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం చేయడంతో భారత్ వాటిని దీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మే 5, 2020న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి పలు దఫాల్లో చర్చలు జరిపినప్పటికీ.. చైనా తన వక్రబుద్ధిని మాత్రం వదులుకోవడం లేదు. సరిహద్దుల్లో ఏదో రకమైన అలజడి సృష్టిస్తూ భారత్ను కవ్వించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. భారత్ సైన్యం వాటిని దీటుగా తిప్పికొడుతోంది.
ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుందని నరవణె సైనిక దినోత్సం సందర్భంగా ఇచ్చిన సందేశంలో పరోక్షంగా చైనాను ఉద్దేశించి హెచ్చరించారు. ఎలాంటి సైనికపరమైన విధ్వంసాన్నైనా ఎదుర్కోవడానికి భారత సైనికులు అదనపు ఏర్పాట్లు సైతం సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ పటిష్ఠ ప్రణాళికలు వ్యవస్థీకృతం చేశామని స్పష్టం చేశారు. ముష్కర మూకల ఏరివేతకు ఇప్పటికే తాము తీసుకున్న చర్యలు భారత సైన్యం సన్నద్ధత.. తిప్పికొట్టే సామర్థ్యాన్ని నిరూపించాయని తెలిపారు.
సైన్యం సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి, ప్రధాని..
సైనిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైన్యం సేవలను కొనియాడారు. దేశ, జాతీయ భద్రతను కాపాడడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడే క్రమంలో సైనికులు వీరోచిత ధైర్య సాహసాలు కనబరుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
సైనిక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. ధైర్య, పరాక్రమాలకు పెట్టింది పేరైన ఇండియన్ ఆర్మీ సేవల్ని మాటల్లో వర్ణించలేమని వ్యాఖ్యానించారు. ‘‘శత్రువుల ముప్పు నుంచి కాపాడడంతో పాటు ప్రకృతి విపత్తుల వంటి మానవతా సంక్షోభంలోనూ సైనికులు అందిస్తున్న సేవలు నిరుపమానవైనవి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న శాంతిస్థాపన కార్యకలాపాల్లోనూ మనదేశ సైనికులు వీరోచిత ప్రదర్శన కనబరుస్తున్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు’’ అని మోదీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..