ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

శియోపూర్‌: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన సంఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటన, శియోపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో శనివారం జరిగింది. అయితే, ఇలా పుట్టిన ఆరుగురిలో ఇద్దరు వెంటనే మరణించారని డాక్టర్లు వెల్లడించారు.

Published : 01 Mar 2020 01:05 IST

శెయోపూర్‌(మధ్యప్రదేశ్‌): ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన సంఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటన, శెయోపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో శనివారం ఉదయం జరిగింది. అయితే, ఇలా పుట్టిన ఆరుగురిలో ఇద్దరు వెంటనే మరణించారని డాక్టర్లు వెల్లడించారు. మిగతా చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, చిన్నారుల ప్రత్యేక విభాగంలో పరిశీలనలో ఉంచామని తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందన్నారు. ఇలా ఆరుగురికి జన్మనివ్వడం మాత్రం ఈ జిల్లాలో ఇదే మొదటిసారి అంటున్నారు డాక్టర్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని