భోజనం.. నీళ్లు లేవు: 800 కి.మీ. ప్రయాణం
మహమ్మారి కరోనా వైరస్ వలస కూలీల పాలిట పెను శాపంగా మారింది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటివరకూ
రాయ్పూర్: మహమ్మారి కరోనా వైరస్ వలస కూలీల పాలిట పెను శాపంగా మారింది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటివరకూ కాలి నడకన, సైకిళ్లపైనా, దొంగచాటుగా వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలు సడలించి ప్రత్యేక రైళ్లు వేయడంతో కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు లారీల ద్వారా వలసకూలీలను తరలిస్తున్నారు. అలా ఛత్తీస్గఢ్కు చేరిన కూలీల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.
తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు ఒక పెద్ద ఇనుప ట్రక్లో పలువురు వలస కూలీలు బయలుదేరి వెళ్లారు. దారి మధ్యలో కనీసం వాళ్లు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. అలా 800 కి.మీ. ప్రయాణించారు. మండుటెండలో వారు పడిన అవస్థలు చెప్పలేనవి. పైన ఎండ మండిపోతుంటే ఆ వేడికి ట్రక్ పెనంలా మాడిపోతుంటే ఆ బాధనంతా పంటి బిగువన భరించారు. తమ బిడ్డలకు ఎండ తగలకుండా చీర కొంగు కప్పి తీసుకెళ్తున్న దృశ్యం అవి చూసిన వారి హృదయాలను కలచి వేసింది.
‘రెండు గంటలకు పైగా మండుటెండలోనే ప్రయాణిస్తున్నాం. కనీసం మాకు తాగడానికి, తినడానికి కూడా ఏమీలేవు’ అని అందులో ప్రయాణిస్తున్న ఓ వలస కూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాలుగు రోజుల కిందట మేము హైదరాబాద్లో బయలు దేరాం. అధికారులెవరూ మాకు ఏదీ ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. కనీసం మా పిల్లలకైనా తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని ఓ మహిళ వాపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.