Corona: ‘కొవిరక్ష’తో కరోనాకు దూరం

కరోనా సోకకుండా నివారించటంతో పాటు చికిత్సలోనూ ఉపకరించే ఆయుర్వేద ఉత్పత్తి ‘కొవిరక్ష’ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అంకుర సంస్థ నూతన్‌ ల్యాబ్స్‌ మంగళవారం బెంగళూరులో ఆవిష్కరించింది. కర్ణాటక ఆయుష్‌ శాఖ అనుమతి పొందిన

Updated : 16 Jun 2021 07:03 IST

ఆయుర్వేద తైలాన్ని ఆవిష్కరించిన బెంగళూరు అంకుర సంస్థ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కరోనా సోకకుండా నివారించటంతో పాటు చికిత్సలోనూ ఉపకరించే ఆయుర్వేద ఉత్పత్తి ‘కొవిరక్ష’ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అంకుర సంస్థ నూతన్‌ ల్యాబ్స్‌ మంగళవారం బెంగళూరులో ఆవిష్కరించింది. కర్ణాటక ఆయుష్‌ శాఖ అనుమతి పొందిన ఈ ఆయుర్వేద తైలాన్ని రజత భస్మం (సిల్వర్‌ కొలాయిడల్‌)తో పాటు పలు వనమూలికలతో తయారు చేసినట్లు ఈ సంస్థ ప్రకటించింది. సెంటర్‌ ఫర్‌ నానో సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎన్‌ఎస్‌ఈ), టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ (టీబీఐ) సాంకేతిక సహకారంతో ఈ తైలాన్ని తయారు చేసినట్లు సంస్థ ప్రధాన పరిశోధకుడు హెచ్‌.ఎస్‌.నూతన్‌ తెలిపారు. ఈ తైలానికి గత వారం ఆయుష్‌ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ‘ముఖంతో పాటు చేతులకు ఈ తైలాన్ని రుద్దితే మూడు గంటలు ప్రభావం ఉంటుంది’ అని సంస్థ ప్రకటించింది. ఐఐఎస్‌సీ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యులు డాక్టర్‌ కిరుబా డేనియల్‌, నూతన్‌ ల్యాబ్స్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ వేణు శర్మ ఈ ఉత్పత్తిని ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని