UP: విడిపోయిన భార్యే సవతి తల్లి..!

ఐదేళ్ల క్రితం మైనర్లుగా ఉన్నప్పుడే వారిద్దరు పెళ్లిచేసుకున్నారు.

Updated : 05 Jul 2021 12:12 IST

బదాయూ: ఐదేళ్ల క్రితం మైనర్లుగా ఉన్నప్పుడే వారిద్దరు పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకే భర్త తాగుబోతంటూ ఆమె వదిలేసింది. కలసి ఉండడానికి అతడు ఎంత ప్రయత్నించినా ససేమిరా అంది. కొంతకాలానికి ఆ యువకుడి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయన కోసం వెతుకుతున్న క్రమంలో.. తనను వదిలేసిన మహిళను తండ్రి పెళ్లిచేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయాడు. విడిపోయిన భార్య కాస్తా.. ఇప్పుడు తనకు సవతి తల్లి కావడంతో షాక్‌ అయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ఇల్లు వదిలివెళ్లిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని ఆ యువకుడు అధికారులను ఆశ్రయించగా.. వారి అన్వేషణలో అసలు కథ బయటపడింది. 48 ఏళ్ల ఆ తండ్రి కొన్నేళ్ల క్రితం కుమారుడు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్‌ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీనిపై ఆ వ్యక్తి బిసౌలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె మాత్రం రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని, మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని