Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో.. సుప్రీంకోర్టు ‘లక్ష్మణ రేఖ’ దాటింది..!
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం
విమర్శించిన మాజీ న్యాయమూర్తులు
దిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ దాటిందని.. దాన్ని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు అవసరమని కొంతమంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు విమర్శించారు. ఈ మేరకు 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ మాజీ అధికారులు, సాయుధ బలగాలకు చెందిన 25 మంది రిటైర్డ్ అధికారులు బహిరంగ లేఖ రాశారు.
‘‘దేశంలోని అన్ని సంస్థలు రాజ్యాంగం ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తేనే ప్రజాస్వామ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని మేం అభిప్రాయపడుతున్నాం. ఇటీవల సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు (నుపుర్ శర్మ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) లక్ష్మణరేఖను దాటాయి. అందువల్లే మేం ఈ బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలు దేశం లోపల, వెలువల అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. న్యాయస్థానాల నుంచి ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు.. అతిపెద్ద ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థపై చెరగని మచ్చ వేస్తాయి. ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై ఇవి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశమున్నందున.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం. ఈ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాలు న్యాయపరమైన విలువలకు లోబడి లేవు. కోర్టు తీర్పులో భాగం కానీ ఈ వ్యాఖ్యలు.. న్యాయబద్ధతను అపవిత్రం చేస్తాయి’’ అని ఈ బృందం తమ ప్రకటనలో వెల్లడించింది.
‘‘ఆ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు.. పిటిషనర్ లేవనెత్తిన సమస్యతో సంబంధం లేకుండా ఉన్నాయి. అంతేగాక, న్యాయపరంగా అన్ని నిబంధనలు అతిక్రమించేలా ఉన్నాయి. ఈ కేసులో ఆమె తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే చోటుకు బదిలీ చేయాలని కోరింది. కానీ, ఇందులో ఆమెకు న్యాయం దక్కలేదు. నుపుర్ కేసును ఎందుకు విభిన్నంగా చూశారన్నది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. ఇలాంటి ఘటనలు సుప్రీంకోర్టు పవిత్రత, గౌరవంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి’’ అని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విమర్శలకు కారణమేంటంటే..
ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే ఎఫ్ఐఆర్లను ఒకటిగా చేయాలంటూ నుపుర్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలాల ధర్మాసనం.. నుపుర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం లేదా నీచ కార్యకలాపాల కోసం ఏమైనా చేస్తారా? అని ఆక్షేపించింది. ఈ వ్యాఖ్యలకు గానూ దేశం మొత్తానికి నుపుర్ క్షమాపణలు చెప్పాలని తెలిపింది. ఈ తీవ్ర వ్యాఖ్యలపైనే మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులు విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: నుపుర్ శర్మ దేశాన్ని రెచ్చగొట్టారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..