Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని పట్టాలపైకి చేర్చేందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది.
అంతెత్తున గూడ్సుపైకి వెళ్లిన ఇంజిన్
లూప్లైన్లోకి వెళ్లినా తగ్గని కోరమాండల్ స్పీడు
ఈనాడు, హైదరాబాద్: సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని పట్టాలపైకి చేర్చేందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది. భారీ క్రేన్లతో గంటల తరబడి శ్రమిస్తేనే సాధ్యమవుతుంది. ఒక్కో రైలు ఇంజిన్ (లోకోమోటివ్) బరువు 108.3 టన్నుల నుంచి 112.8 టన్నుల వరకు ఉంటుంది. అంతటి భారీ బరువుండే రైలు ఇంజిన్....ఒడిశా ప్రమాదంలో అమాంతంగా దాదాపు 15 అడుగుల ఎత్తుకు ఎగసి గూడ్సుపైకి ఎక్కడం నిపుణుల్నీ విస్మయానికి గురిచేస్తోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు సమాచారం. రైలును లూప్లైన్కి మళ్లించినప్పుడు వేగం గణనీయంగా తగ్గుతుంది. కానీ కోరమాండల్ వేగం ఎందుకు తగ్గలేదన్నది మరో కీలక ప్రశ్నగా మారింది.
గూడ్సు రైలు భారీ బరువు
ప్రయాణికుల రైళ్లలో గరిష్ఠంగా 24 బోగీలుంటాయి. అదేగూడ్సు రైళ్లలో 40-58 వ్యాగన్లు ఉంటాయి. ఒక్కో ఖాళీ వ్యాగన్ 25-26 టన్నుల బరువు ఉంటే.. బొగ్గు, సిమెంటు వంటి వాటి బరువు ఒక్కో దాంట్లో మరో 54-60 టన్నుల వరకు ఉంటుంది. దీనిని కోరమాండల్ రైలు ఢీకొట్టింది. సాధారణంగా అయితే ముందున్న రైలు తీవ్రంగా దెబ్బతినాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. వేగంగా వస్తున్నందునే కోరమాండల్ ఎక్స్ప్రెస్ భారీగా దెబ్బతింది. అందులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుతెచ్చిపెట్టింది. 130 కి.మీ. వేగంతో ఢీకొట్టడంతోనే కోరమాండల్ ఇంజిన్ గూడ్సుపైకి ఎక్కినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎల్హెచ్బీ కోచ్లున్నా..
పాతతరం బోగీల స్థానంలో జర్మన్ టెక్నాలజీ, కొత్త రకం ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్బుష్) బోగీలను రైల్వేశాఖ కొన్నేళ్లుగా ప్రవేశపెడుతోంది. ఈ బోగీలు ఉన్న రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు అతి తక్కువ ప్రాణనష్టమే జరిగింది. కానీ కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఎల్హెచ్బీ బోగీలున్నా భారీ ప్రాణనష్టం జరిగింది. ఎల్హెచ్బీ బోగీలు పట్టాలు తప్పిన సందర్భాలో నష్టాన్ని తగ్గిస్తాయని..చక్రాలు నేలలోకి కూరుకుపోతాయని, బోగీలు ఒకదానిపైకి మరోటి ఎక్కవని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒడిశా ప్రమాదంలో ఢీకొట్టింది గూడ్సు రైలును కావడం, అది అత్యంత బరువుతో ఉండటం.. కోరమాండల్ ప్రమాద సమయంలో 130 కి.మీ. భారీ వేగంతో ఉండటంతోనే ఇంజిన్, బోగీలు అమాంతం పైకి లేవడంతో పాటు చెల్లాచెదురయ్యాయని నిపుణులు, రైల్వే అధికారుల నుంచి మరో వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!