మొదలైన విచారణ
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్ఎస్) విచారణ మొదలైంది. ఆగ్నేయ రైల్వే సర్కిల్ కమిషనర్ ఎ.ఎం.చౌధరి సోమవారం బహానగా బజార్ రైల్వేస్టేషన్లోని ఘటనాస్థలిని సందర్శించారు.
రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన భద్రతా కమిషనర్
లోకోపైలట్లు సహా సిబ్బంది నుంచి వివరాల సేకరణ
పునరుద్ధరించిన మార్గంలో యథావిధిగా రైళ్ల రాకపోకలు
రెండు లైన్లూ అందుబాటులోకి
వెనక్కి మళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు
రంగంలో దిగనున్న సీబీఐ
బాలేశ్వర్, ఈనాడు-హైదరాబాద్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్ఎస్) విచారణ మొదలైంది. ఆగ్నేయ రైల్వే సర్కిల్ కమిషనర్ ఎ.ఎం.చౌధరి సోమవారం బహానగా బజార్ రైల్వేస్టేషన్లోని ఘటనాస్థలిని సందర్శించారు. ప్రమాదానికి గురైన రైళ్లను, రైలుమార్గం పరిస్థితిని ఆయన ప్రాథమికంగా పరిశీలించారు. కంట్రోల్రూం, సిగ్నల్రూంలను సందర్శించారు. స్టేషన్ మేనేజర్తో మాట్లాడారు. ఈ నెల 2వతేదీ రాత్రి జరిగిన దుర్ఘటనలో షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు లూపులైన్లో ఆగిఉన్న గూడ్సురైలును ఢీకొట్టడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ఇంటర్లాకింగ్ వ్యవస్థను కూడా చూశారు. ప్రమాదానికి గురైన కోరమాండల్, బెంగళూరు-హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్సు రైలులో విధులు నిర్వర్తించిన లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్లో సిగ్నలింగ్ సిబ్బంది సహా 55 మందిని విచారణకు పిలిచారు. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఖరగ్పుర్లో విచారణ కొనసాగనుంది. స్టేషన్ సిగ్నల్ మెయింటనర్, సెక్షన్ కంట్రోలర్, ఖరగ్పుర్ డివిజన్కు సంబంధించిన సీనియర్ డివిజనల్ సిగ్నల్-టెలికాం ఇంజినీర్, బాలాసోర్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు సహా టీటీఈలు, ప్యాంట్రీకార్ మేనేజర్ తదితరుల్ని, ప్రత్యక్ష సాక్షుల్ని విచారణకు పిలిచారు. సీఆర్ఎస్ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాద కారణాలపై కొద్దిరోజుల్లోనే నివేదిక ఇవ్వనున్నారు. ‘మేం ఇప్పుడే పని ప్రారంభించాం. పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. ప్రమాదానికి కచ్చితమైన కారణమేమిటనేది ఆ తర్వాతే తేల్చగలం’ అని సీఆర్ఎస్ విలేకరులకు తెలిపారు.
ప్రయాణిస్తున్నవారిలో ఉద్విగ్నత
ఆదివారం రాత్రి పునరుద్ధరించిన పట్టాలపై తొలిసారిగా గూడ్సురైలు ప్రయాణించిన సమయంలో అక్కడ ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులు జోడించి నమస్కరిస్తూ, డ్రైవర్లకు అభివాదం చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. ప్రమాద ఘటనతో చలించిపోయిన ఆయన.. ఆ రైలు వెళ్తున్నప్పుడు మౌనంగా చూస్తూ కనిపించారు. అవిశ్రాంతంగా పనిచేసిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం హావ్డా-పూరీ వందేభారత్ సహా వివిధ రైళ్లు ఆ పట్టాలపై నెమ్మదిగా రాకపోకలు సాగించాయి. అప్లైన్, డౌన్లైన్ కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని రైల్వేవర్గాలు ప్రకటించాయి. ఆ మార్గాల్లో రైళ్లు వెళ్తున్నప్పుడు ప్రయాణికులు కిటికీల నుంచి ఉద్విగ్నంగా పరిశీలిస్తూ కనిపించారు. చెల్లాచెదురుగా పడిఉన్న శకలాలను చూసి పలువురికి నోటమాట రాలేదు. మూడురైళ్లు ప్రమాదానికి గురైనచోట గత కొద్దిరోజులుగా మోహరించిన ‘జాతీయ విపత్తు స్పందన దళం’ (ఎన్డీఆర్ఎఫ్) బలగాలు తమ కార్యకలాపాలు ముగించాయి. 121 మృతదేహాలను వెలికితీయడంతో పాటు 44 మంది బాధితుల్ని ఈ బలగాలు రక్షించాయని అధికారులు తెలిపారు.
‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..
రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాలేశ్వర్లోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) స్టేషన్లోనూ కేసు నమోదైంది. కొన్ని పరిణామాలపై అనుమానం ఉండడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థ రంగంలో దిగనుంది. నిబంధనల ప్రకారం జీఆర్పీ స్టేషన్లో కేసు ఆధారంగా తిరిగి కేసు నమోదు చేసుకుని విచారణకు చేపట్టనుంది. దీనికోసం దిల్లీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్రైం విభాగాన్ని కేటాయించనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన కొన్ని అంశాల కారణంగానే సీబీఐ విచారణ అవసరమైందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్లైన్కు ఖాయం చేసిన రూటును లూప్ లైనుకు మార్చడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
నిలకడగా లోకోపైలట్ల ఆరోగ్యం
భువనేశ్వర్: ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ లోకోపైలట్గా ఉన్న గుణనిధి మహంతి, సహాయ పైలట్ హజారీ బెహరాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరు భువనేశ్వర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ‘మహంతిని సోమవారం ఐసీయూ నుంచి బయటకు మార్చారు. బెహరాకు తల శస్త్రచికిత్స చేయాల్సి ఉంది’ అని ఆగ్నేయరైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఆదిత్య చౌధరి తెలిపారు. వారినుంచి రైల్వే భద్రత కమిషనర్ వాంగ్మూలాలు తీసుకున్నారు.
* రైళ్లు ఢీకొట్టుకోకుండా నివారించడంలో కీలకమైన ‘కవచ్’ను ఇంకా ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకురాలేదని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ స్వదేశీ సాంకేతికతను అనుసంధానం చేసేందుకు ఆగ్నేయ రైల్వే (బాలేశ్వర్ మార్గం దీని కిందకే వస్తుంది)కు రూ.468.9 కోట్ల బడ్జెట్ను కేటాయించినా గత మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM