Harbhajan Singh: భజ్జీ నెక్స్ట్ ఇన్నింగ్స్.. పాలిటిక్స్..!
భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విజయంలో కీలక పాత్రతో కెరీర్ను మొదలుపెట్టిన స్నిన్ మాయావి హర్భజన్ సింగ్.. 23ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికాడు.
రాజకీయాల కోసమే క్రికెట్కు వీడ్కోలు పలికారా..!
ఇంటర్నెట్డెస్క్: భారత స్పిన్ మాయావి హర్భజన్ సింగ్.. 23ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు పూర్తిగా వీడ్కోలు చెప్పాడు. మరి భజ్జీ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ..? రాజకీయ నాయకుడిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడా? పాలిటిక్స్ కోసమే రిటైర్మెంట్ ప్రకటించాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది..!
హర్భజన్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతున్నా.. ఆ వార్తలను టర్బోనేటర్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చాడు. అయితే మరికొద్ది నెలల్లో అతడి సొంత రాష్ట్రమైన పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అటు భాజపాకు.. ఇటు అధికార కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు జనాకర్షక నేతలపై గట్టిగా దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే హర్భజన్ను తమ పార్టీలోకి తీసుకోవాలని ఇరుపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం భజ్జీ భాజపాలో చేరుతారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటిని హర్భజన్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని ట్వీట్ చేశాడు. అయితే రాజకీయాల్లోకి రావట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
సిద్ధూతో భేటీ.. ఆంతర్యమేంటీ?
ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసేలా ఇటీవల హర్భజన్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధూ తన ట్విటర్లో షేర్ చేస్తూ ‘‘సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్న ఫొటో’’ అని రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్లో భజ్జీ చేరిక ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని హర్భజన్ ఖండించకపోవడం కూడా ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చినట్లయింది.
సిద్ధూతో భేటీ జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత భజ్జీ.. గురువారం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రాజకీయాల కోసమే ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘ఇటీవల హర్భజన్.. సిద్ధూతో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై ఆయన ఆసక్తిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనే నిలబెట్టాలని భావిస్తోంది’’ అని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇక, గత రెండు రోజులుగా సిద్ధూ.. భజ్జీతో టచ్లోనే ఉన్నారట. చండీగఢ్లోని సిద్ధూ స్నేహితుడి నివాసంలో త్వరలోనే వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతోనూ భజ్జీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపాయి. అవే నిజమైతే వచ్చే ఎన్నికల్లో హర్భజన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పోటీ అక్కడి నుంచేనా..!
భజ్జీ స్వస్థలం జలంధర్. ఇది దోబా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ప్రస్తుతం అక్కడ బలంగా ఉన్న శిరోమణి అకాలీదళ్.. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఈ కూటమిని ఎదుర్కొనేందుకు భజ్జీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ భజ్జీ అంగీకరిస్తే నకోదార్ అసెంబ్లీ నుంచి అతడిని పోటీకి నిలబెట్టాలని చూస్తోంది. లేదా.. ఈ ప్రాంతంలో ప్రచారకర్తగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి భజ్జీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడో చూడాలి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్