India Corona : వెయ్యికి దిగివచ్చిన కొత్త కేసులు..

దేశంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 1500లోపే నమోదవుతున్న

Updated : 03 Apr 2022 12:34 IST

దిల్లీ : దేశంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 1500లోపే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా వెయ్యికి చేరువకు దిగిరావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా వందలోపే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ  వెల్లడించిన వివరాల ప్రకారం..

  1. గడిచిన 24 గంటల్లో 4,65,904 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1096 కేసులు వెలుగులోకి వచ్చాయి.
  2. నిన్న 81 మరణాలు చోటుచేసుకోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,21,345కు చేరింది.
  3. తాజాగా 1447 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది.
  4. రికవరీలు ఎక్కువగా ఉంటుండంతో.. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 13,013(0.03%)కు క్షీణించాయి.
  5. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 12,75,495 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 184.66 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు