రెండోరోజు వందలోపు మరణాలు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం 7,85,220 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,989 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని...
14,989 కొత్త కేసులు..98 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం 7,85,220 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,989 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది. కాగా, మరణాల సంఖ్య రెండో రోజు వందలోపే నమోదైంది. నిన్న 98 మంది మృత్యు ఒడికి చేరుకోగా..ఇప్పటివరకు 1,57,346 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు.
ఇదిలా ఉండగా క్రియాశీల కేసుల్లో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 1,70,126 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.53 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 13,123 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీలు 1.08కోట్లకు పైబడగా..ఆ రేటు 97.06 శాతంగా ఉంది.
మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. మార్చి ఒకటిన ఇది రెండో దశలోకి అడుగుపెట్టింది. నిన్న 7,68,730 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 1,56,20,749 మందికి టీకా అందించినట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్