India Corona: భారీ ఊరట.. 24 గంటల్లో 27 మరణాలే..!

దేశంలో ఈ రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. 2020 మే ప్రారంభం నాటికి మహమ్మారి ఉద్ధృతి తగ్గిపోయి ఊరటనిస్తోంది.

Updated : 14 Mar 2022 10:05 IST

కొత్త కేసులు 2,500 మాత్రమే..

దిల్లీ: దేశంలో ఈ రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కొత్త కేసులు, మరణాల్లో గణనీయ తగ్గుదల నమోదైంది.  వైరస్ వ్యాప్తి 2020 మే ప్రారంభం నాటి స్థాయికి తగ్గిపోయి భారీ ఊరటనిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కేవలం 2,503 కేసులు, 27 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం 5,32,332 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. పరీక్షలు సంఖ్య తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం ఒక శాతం దిగువనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...

ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 4.24 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. 5.15 లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఇటీవల కాలంలో రోజూవారీ మరణాలు 100 దిగువన నమోదవుతున్నాయి. ముందురోజు ఆ సంఖ్య 47గా ఉండగా.. తాజాగా 27కి చేరింది. ఇక కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 36,168గా ఉంది. దాంతో యాక్టివ్‌ కేసుల రేటు 0.08 శాతానికి క్షీణించింది. కరోనా కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని