India Corona: 2,200 కేసులు.. 2,550 రికవరీలు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. ఆదివారం 2.97 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,202 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Published : 16 May 2022 10:09 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఆదివారం 2.97 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,202 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 3 వేలకు దిగువన నమోదు కావడం ఊరటనిస్తోంది. నిన్న పరీక్షల సంఖ్య తగ్గడం కూడా కేసులు తగ్గుదలకు కారణం కావొచ్చు. 24 గంటల వ్యవధిలో 2,550 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మహమ్మారి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 17,317(0.04శాతం)కు తగ్గిపోయాయి. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 4.25 కోట్ల మందికి పైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న 27 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5.24 లక్షలు దాటింది. మొత్తంగా 191 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని సోమవారం కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని