‘సెకండ్ వేవ్’ విలయం: నిమిషానికి 243 కేసులు!
దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 243 పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం.
పాజిటివిటీ రేటు అదుపులోకి తేవాల్సిందే
భయాలు వద్దంటోన్న వైద్యరంగ నిపుణులు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిమిషానికి 243 పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే, తాజా పరిస్థితులు ఆందోళనకరమైనవే అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.
సెకండ్ వేవ్ ధాటికి కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా 3లక్షల 49వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వరుసగా నాలుగో రోజు 3లక్షలకు పైగా కేసులు నమోదు కావడం కలవరపెట్టే విషయం. ఇలా నిమిషానికి సరాసరి కొత్తగా 243 కేసులు రికార్డవుతున్నాయి. ఇక కొవిడ్ మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. నిమిషానికి దాదాపు ఇద్దరు కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
3 రోజుల్లోనే 10లక్షల కేసులు
దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల క్రితం పది లక్షల కేసులు నమోదుకావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం రోజుకు 3లక్షలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 26లక్షలకు చేరుకుంది.
పాజిటివిటీ రేటు అదుపులోకి తేవాల్సిందే..
విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న కరోనా వైరస్ పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది 16శాతం దాటింది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 30శాతానికి చేరువయ్యింది. ఈ నేపథ్యంలో కొవిడ్ పాజిటివిటీని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. ముంబయిలో 26శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 14శాతానికి తగ్గినట్లు ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ నవీత్ విగ్ పేర్కొన్నారు. కఠిన నిబంధనలు అమలు పరచడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తుచేశారు. ఇలా జిల్లా స్థాయిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతానికి తక్కువగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెమ్డెసివిర్ మంత్రదండం కాదు..
కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. రెమ్డెసివిర్ ఔషధానికి తీవ్ర డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఔషధం మ్యాజిక్ బుల్లెట్ కాదని..కేవలం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికే ఇది అవసరమవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా స్పష్టం చేశారు. అనవసర భయాలకు లోనుకావద్దని.. అదే సమయంలో ఆక్సిజన్, రెమ్డెసివిర్లను వృథా చేయకూడదని డాక్టర్ గులేరియా సూచించారు. కొవిడ్ నిబంధనలు కఠినంగా పాటించడం వల్ల వచ్చే మూడు వారాల్లోనే వైరస్ను అదుపులోకి తేవచ్చని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్