India Corona: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రెండురోజులుగా కాస్త తగ్గిన కొత్త కేసులు.. తాజాగా 45 శాతం మేర పెరిగాయి.

Published : 27 Jun 2022 10:05 IST

ఎంతమందికి పాజిటివ్‌గా తేలిందంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రెండురోజులుగా కాస్త తగ్గిన కొత్త కేసులు.. తాజాగా 45 శాతం మేర పెరిగాయి. దాంతో కేసుల సంఖ్య మరోసారి 17 వేల మార్కు దాటింది. క్రియాశీల కేసుల సంఖ్య 94 వేలకు ఎగబాకింది. 

ఆదివారం 3.03 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా.. దిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి. తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. నిన్న 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 197 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని