ఏడాదిన్నరగా జర్మనీ కస్టడీలోనే.. మోదీజీ మా బిడ్డను ఇప్పించండి..!
పరాయి దేశంలో కన్నబిడ్డకు దూరమైన ఓ భారత దంపతుల కన్నీటి గాథ ఇది..! చిన్నారికి అయిన ఓ గాయం ఆ పసికందును తల్లిదండ్రులకు దూరం చేసింది. బిడ్డ కోసం ఏడాదిన్నరగా ఆ జంట చేస్తోన్న న్యాయపోరాటం ఫలించకపోవడంతో.. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కొంగుచాచి వేడుకుంటోంది.
ముంబయి: బతుకుదెరువు కోసం సొంత ఊరిని వదిలి విదేశాలకు వెళ్లిన ఓ దంపతులకు (Indian Couple) ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక వేధింపుల అనుమానాలతో వారి చిన్నారిని జర్మనీ ప్రభుత్వం లాగేసుకుంది. ప్రస్తుతం మూడేళ్ల వయసున్న ఆ పాప ఏడాదిన్నరగా జర్మనీ (Germany) అధికారుల కస్టడీలోనే ఉంది. దీంతో కన్నబిడ్డ కోసం నిరంతరంగా పోరాడుతున్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు స్వదేశానికి తిరిగొచ్చి భారత ప్రభుత్వం నుంచి సాయం అర్థిస్తున్నారు. తమ బిడ్డను ఇప్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi), కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar)ను వేడుకుంటున్నారు.
ఇదీ జరిగింది..
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్కు చెందిన ఓ దంపతులు (Indian Couple) 2018లో ఉపాధి నిమిత్తం బెర్లిన్ వెళ్లారు. అక్కడ వారికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు నెలల వయసున్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ఆమె వ్యక్తిగత అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం బానే ఉందంటూ ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపను చెకప్కు తీసుకురావాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడి వైద్యులు శిశు సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. వారు ఆసుపత్రికి వచ్చి ఆ పాపను తల్లి ఒడి నుంచి తీసుకున్నారు. జర్మనీలో పుట్టిన ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో ఆ పాపను అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. అప్పటికి ఆ చిన్నారి వయసు ఏడాదిన్నర.
ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ తిరుగుతూ..
దీంతో ఆ తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న ఆ పాప.. ఏడాదిన్నరగా జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. విదేశంలో న్యాయం జరగకపోవడంతో ఆ తల్లిదండ్రులు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ముంబయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘ఈ కేసులో మేం డీఎన్ఏ నమూనాలు కూడా ఇచ్చాం. పోలీసు దర్యాప్తు, మెడికల్ రిపోర్టులు అన్నీ పూర్తయ్యాయి. 2022 ఫిబ్రవరిలోనే లైంగిక వేధింపుల కేసు మూసేశారు. అంతేగాక, పాపపై లైంగిక వేధింపుల అనుమానాలను 2021 డిసెంబరులోనే ఆ ఆసుపత్రి కొట్టిపారేసింది. అవన్నీ తీసుకుని మేం జర్మనీ ఛైల్డ్ సర్వీసెస్ అధికారుల దగ్గరకు వెళ్లాం. కానీ, వారు మాపైనే తిరిగి కేసు పెట్టారు. దానిపై మేం కోర్టుకు వెళ్లాం. అక్కడ తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే మా సమర్థతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ పరీక్షల్లో సైకాలజిస్టు కేవలం 12 గంటలే మాతో మాట్లాడి మాకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు’’ అని ఆ పాప తండ్రి వాపోయాడు.
పాపను భారత్కు పంపించేందుకు కూడా అక్కడి అధికారులు అంగీకరించట్లేదట. పాపను నెలకోసారి గంటపాటు కలిసేందుకు మాత్రమే తమను అనుమతిస్తున్నారని చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామని, నెలకు రెండు సార్లు పాపను చూసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చినా.. అధికారులు ఆ ఆదేశాలను పాటించలేదని ఆరోపించారు. ‘‘నేరస్థులను కూడా వారి కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతి కల్పిస్తారు. కానీ మా బిడ్డను క్రిమినల్ కంటే దారుణంగా చూస్తున్నారు. ఆ దేశంలో మాకు న్యాయం జరగట్లేదు. ఈ విషయంలో మాకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే అది సాధ్యమవుతుంది’’ అని చిన్నారి తల్లిదండ్రులు వేడుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్