Kangana Ranaut: కంగనపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన నటి

కాంగ్రెస్ నేత చేసిన విమర్శలను బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut) తిప్పికొట్టారు.

Updated : 08 Apr 2024 14:08 IST

దిల్లీ: తన ఆహార అలవాట్ల గురించి వస్తోన్న విమర్శలపై బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బీఫ్‌ తిన్నానని కంగన గతంలో వెల్లడించారంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఇటీవల విమర్శలు చేశారు. దీనిపై తాజాగా నటి స్పందించారు. ‘‘నేను బీఫ్, రెడ్ మీట్ ఏదీ తినను. నాకు సంబంధించి పూర్తిగా నిరాధారమైన వదంతులు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు. కొన్ని దశాబ్దాలుగా నేను యోగా, ఆయుర్వేద జీవన శైలిని ప్రచారం చేస్తున్నాను. నా పరువుకు భంగం కలిగించేందుకు చేసే ఇలాంటి కుట్రలు పనిచేయవు. నా ప్రజలకు నా గురించి తెలుసు. ఇలాంటివి వారిని తప్పుదోవ పట్టించవు’’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

‘ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించారు’: కాంగ్రెస్‌పై యోగి విమర్శలు

గత నెల కంగన భాజపాలో చేరారు. మండి నుంచి పార్టీ ఆమె పేరును ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత తొలి ప్రధాని బోస్‌ అని పేర్కొనడం వివాదాస్పదమైంది. దానిపై ఆమె వివరణ ఇస్తూ.. తనకు హితబోధ చేయొద్దని కౌంటర్ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని