Aryan Khan: ఆర్యన్ వచ్చేవరకు ఇంట్లో స్వీట్లు వండకూడదు.. గౌరీ ఆర్డర్
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీలో ఉండి ఇప్పటికి రెండు వారాలు దాటింది. ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన
ముంబయి: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీలో ఉండి ఇప్పటికి రెండు వారాలు దాటింది. ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన అతడికి ఇంకా ఊరట లభించలేదు. ప్రస్తుతం ఆర్యన్ ఆర్థర్ రోడ్లోని సెంట్రల్ జైలులో ఉన్నాడు.కొడుకు జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం దిగాలుగా ఉంటోంది. అతడికి త్వరగా బెయిల్ రావాలని తల్లి గౌరీఖాన్ పూజలు చేస్తూనే ఉన్నారు. అంతేనా.. ఆర్యన్ తిరిగొచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దని గౌరీ తన వంట సిబ్బందికి ఆర్డర్ వేశారట.
ఇటీవల షారూక్ నివాసం మన్నత్లో మధ్యాహ్న భోజనం కోసం వంట సిద్ధం చేస్తున్న సిబ్బంది ఖీర్ వండారు. దీన్ని గుర్తించిన గౌరీ వెంటనే కిచెన్లోకి వెళ్లి దాన్ని ఆపారు. ఆర్యన్ బెయిల్పై విడుదలై ఇంటికి వచ్చేవరకు మన్నత్ కిచెన్లో ఎలాంటి స్వీట్లు వండటానికి వీల్లేదని గౌరీ ఆదేశించినట్లు షారూక్ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు. సాధారణంగా పండగ రోజుల్లో మన్నత్ వేడుకలతో కళకళలాడిపోయేది. అయితే ఇప్పుడు ఆర్యన్ జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉంది. ఇటీవల నవరాత్రి రోజుల్లో గౌరీ తన కొడుకు కోసం నిరంతరం పూజలు చేశారని సదరు సిబ్బంది వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. అక్టోబరు 20న తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. జైల్లో ఉన్న ఆర్యన్.. ఇటీవల షారూక్, గౌరీలతో కొంతసేపు వీడియో కాల్ మాట్లాడాడు. ఆ సమయంలో అతడు ఒకింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు జైల్లో ఆర్యన్కు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని హామీ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.