- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
సాగు చట్టాలు: సుప్రీంకు చేరిన కమిటీ ‘నివేదిక’!
మార్చి 19నే నివేదించినట్లు సమాచారం
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సాగుచట్టాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన నివేదికను మార్చి 19వ తేదీనే ముగ్గురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది.
సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి నెలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వీరిలో ఒకరైన భూపీందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి మొదట్లోనే తప్పుకున్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపిన మాన్.. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన షెట్కరీ సంఘటనా అధ్యక్షుడు అనిల్ ఘన్వాత్తో పాటు వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్ గులాటీ, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీలు దేశవ్యాప్తంగా రైతులు, వివిధ రంగాల నిపుణులతో పలు దఫాల్లో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం నేరుగా, ఆన్లైన్ సహాయంతో వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం వీటిపై రూపొందించిన నివేదికను ఈమధ్యే సుప్రీం కోర్టుకు నివేదించినట్లు సమాచారం.
ఇక వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు జనవరి 11న స్టే విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సంప్రదింపుల కోసం కమిటీ నియమించింది. మరోవైపు, ఈ చట్టాలను పూర్తిగా రద్దుచేయాలని, అప్పటిదాకా తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. దీనిపై దేశ రాజధాని దిల్లీ సరిహద్దులతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ రైతు సంఘాల నాయకులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..