Harnaaz Sandhu: విశ్వసుందరికి ప్రధాని మోదీ కంగ్రాట్స్‌!

మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పంజాబ్‌ యువతి హర్నాజ్‌ సంధుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ...

Published : 14 Dec 2021 01:45 IST

దిల్లీ: మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పంజాబ్‌ యువతి హర్నాజ్‌ సంధుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌- 2021 పోటీల్లో హర్నాజ్‌ సంధు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించి అందాల కిరీటాన్ని గెలుచుకోవడంపై ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు చెబుతూ మోదీ ట్వీట్‌ చేశారు.

తన అందంతో పాటు జడ్జిలు అడిగిన కఠినమైన ప్రశ్నలకు తెలివైన సమాధానాలు చెప్పడం ద్వారా వారిని మెప్పించిన 21ఏళ్ల హర్నాజ్‌ సంధు విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఇప్పటివరకు భారత్‌ నుంచి ఈ అరుదైన స్థానం దక్కించుకున్న సుస్మితా సేన్‌ (1994), లారా దత్తా (2000) సరసన చేరింది. గతంలోనూ అందాల పోటీల్లో పాల్గొని టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. హర్నాజ్‌ పంజాబ్‌ చిత్రాల్లోనూ నటించింది.

గర్వకారణం: కాంగ్రెస్‌
హర్నాజ్‌ సంధు విశ్వసుందరి కిరీటం గెలుచుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. మన దేశ పుత్రిక మరోసారి మనల్ని గర్వపడేలా చేసిందంటూ ట్వీట్‌ చేసింది. విశ్వసుందరి కిరీటం సాధించి దేశ కీర్తిని తెచ్చిపెట్టినందుకు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని